రూ.25 కోట్ల విలువైన శివుని సత్రం అమ్మకానికి అడుగులు..!
మంగళగిరి నడిబొడ్డునున్న శివాలయ సత్రం .. నేడు అమ్మకానికి విపణీలోకి వచ్చింది. రూ.25 కోట్లు విలువ చేసే సత్రం భూమిని కాజేందుకు తెరమాటున బడాబాబులు పావులు కదుపుతున్నట్లు అందుతున్న సమాచారం. ప్రస్తుతం శివాలయంలో ఉన్న శివలింగం ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్టించిందిగా స్థలపురాణం చేబుతోంది. నేడు నూటపాతికేళ్ల క్రితం శివుని దర్శనార్థం వస్తున్న భక్తుల కోసం గదుల నిమిత్తం సత్రానికి స్థలాన్ని దాత దానం మిచ్చారు. అయితే మంగళగి చుట్టుపక్కల స్థలాలకు రెక్కలు రావడంతో దాత వారుసలం అంటూ కొందరు పుట్టుకొచ్చి శివాలయం ప్రాంగణంలోని సత్రం స్థలాన్ని అమ్మకానికి పెట్టారు. కొనేందుకు ముందుకొచ్చి వ్యక్తి న్యాయపద్దతుల ద్వారా పాత రికార్డులు తిరగవేయడంతో అసలు నిజం వెల్లడైంది.
సత్రం భూములుపై కన్ను …!
వందేళ్ల క్రితం శివాలయానికి దగ్గరలో బచ్చు గురు మూర్తి అనే వ్యక్తి ఎకరం స్థలం దానమివ్వగా అది నేటికీ బస్సు గురు మూర్తి సత్రంగా పిలవబడుతోంది. ఇటీవల ఎమ్మెల్యే ఆర్కే ఎండోమెంట్ అధికారులు పరిశీలించి, 50 ఏళ్లుగా ఉంటున్న వారిని ఖాళీ చేయమని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న ఆ సత్రం గదులను కూల్చివేసి నూతన భవన నిర్మాణం కోసం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే పెద్ద కోనేటి వీధిలో ఉన్న సర్వే నెంబర్లు 234,235,236 లలో గత కొంతకాలంగా ఆక్రమణలో ఉన్న 17 సెంట్ల స్థలాన్ని కూడా ఆలయ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు పరిశీలనలో తీగ లాగితే డొంకంతా కదిలింది. దేవాలయానికి సత్రం స్థలం దానమిచ్చిన మరో రెండు సత్రాల స్థలాల ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్రమణ కు గురైన 17 సెంట్ల స్థలాన్ని విచారించిన అధికారులకు బాలమ్మ సత్రం స్థలం విషయం అధికారుల దృష్టిలోకి వచ్చినట్లు సమాచారం. 1887 సంవత్సర కాలంలో లింగమల్లు అనే ఇంటి పేరు గల వారు శివాలయానికి సత్రం స్థలంగా దానం ఇచ్చారు. దీంతో లింగమల్లు వారుసులు కొందరు రంగ ప్రవేశం చేసి స్థలంలో ఇళ్లు నిర్మించి అద్దెలకు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఈ ఇంటికే మున్సిపల్ పన్ను కూడా చెల్లించడం గమనార్హం! ఈ క్రమంలో లింగమల్లు వారుసులుగా చెలమణిలో ఉన్న వీరు మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ స్థలాన్ని భాగపంపిణీ దఖలు రిజిస్ట్రేషన్ కూడా చేయించారని భోగట్ట! స్థలం దానమిచ్చిన దాతకు ముగ్గురు సంతానం అయితే ఒకరేనని దస్తవేజుల్లో పొందరచడంతో అసలు విషయం బయటకొచ్చింది.
అన్యక్రాంతానికి అడ్డగా మారుతున్న వైనం..!
మంగళగిరి పరిశర ప్రాంతాలోని దాదాపు 10 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న వందల కోట్లు విలువచేసే భూములు అన్యక్రాంతానికి గురౌతున్నాయి. ఇలా రామనుజ కూటమి స్థలం 25 సెంట్లు, పెద కోనేరు పడమర వైపు బాలమ్మ సత్రం స్థలం, శివాలయం, నృసింహుని ఆలయానికి చెందిన వందల కోట్ల విలువైన భూములు, దాతలు ఇచ్చిన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. దీనిపై సమగ్రంగా విచారించి, ఆ స్థలాను న్యాయపరంగా వెనక్కి తీసుకుని, పరిరక్షించాలని కోరుతున్నారు.
Must Read ;- సామాజిక న్యాయం సిగ్గుతో తలదించుకొంటుంది!











