కీలక నామినేట్ పదవుల్లో ఉంది అందరూ రెడ్లే!
జగన్ రెడ్డి అధికారంలో వచ్చిన నాటి నుంచి వివిధ నామినేట్ పదవుల్లో రెడ్లే కే అధికప్రాధన్యతనిచ్చి .. బడుగుబలహీన వర్గాలను అణతొక్కారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమైన పదవుల్లో సొంత కులానికి 1600 పదవులను కట్టబెట్టారని ఆరోపించారు. అన్ని సామాజీక వర్గాల వారికి ప్రధాన్యతనిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి సొంతవారితో వారిపై పెత్తనం చేస్తున్నమాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. వివిధ శాఖల్లో పన్నులను పెంచి ప్రజల నడ్డివిరవడంతో పాటు బడుగుల వెన్నువిరుస్తున్నారు. సమస్యల సుడిగుండంలో ఏపీని పడివేసి .. ఇంకా అప్పుల కోసం బ్యాంకుల వద్ద జోలిపడుతున్నారని మంగళగిరి పర్యటనలో ఉన్న లోకేష్ జగన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు.
Must Read ;- జగన్పై కడప సర్పంచ్లే తిరుగుబాటు.. మూకుమ్మడి రాజీనామాలు!











