కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ (టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) సర్టిఫికెట్ గడువును ఏడేళ్ల నుంచి జీవితాకాలనికి పొడగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల కాలపరిమితి ముగిసిన వారికి మళ్లీ సర్టిఫికెటు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ పలు సూచనలు జారీ చేసింది. ఈ నిర్ణయం ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనుకునేవారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోనున్నాయి.
Must Read ;- జగన్రెడ్డికి పరీక్షలపై సమీక్షించే సమయమే లేదా : నారా లోకేష్