అమ్మ ఒడి పేటెంట్ను తల్లికి వందనం పేరుతో తెలుగుదేశం లాగేసుకోవడంతో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు కడుపుమంటతో రగిలిపోతున్నారు. దీంతో తల్లికి వందనం పథకంపై ఫ్యాన్ పార్టీ నేతలు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బ్లూ మీడియా సాక్షిలోనూ తప్పుడు కథనాలను వండి వారుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలకు మరోసారి మంత్రి లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. సాక్షిలో తల్లికివందనంపై వచ్చిన తప్పుడు కథనాన్ని ఖండించిన లోకేష్..జగన్పై సెటైర్లు వేశారు.
లోకేష్ ట్వీట్ ఇదే –
జగన్ గా రూ.. మీరు కడుపు మంటతో అల్లాడుతున్నారు. నాకు తెలుస్తోంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తా. నీళ్లలో కలుపుకొని తాగండి. కడుపు మంట తగ్గుతుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న తల్లికి వందనం పథకం అమలు తీరు జగన్ కడుపు మంటను మూడింతలు పెరిగేలా చేసిందన్నారు లోకేష్. అందుకే తన విష పత్రికలో నకిలీప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరికీ నిధులు అందాయని..ఈవిషయం తెలిసి కూడా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. దొంగలెక్కలు సృష్టించడం.. పేదల పేరుతో సొమ్ము కొట్టేయడం జగన్ బ్రాండ్ అని వ్యాఖ్యానించారు.
ఇది ప్రజా ప్రభుత్వం అన్న విషయం జగన్ మరిచిపోయినట్టుగా ఉన్నాడంటూఫైర్ అయ్యారు లోకేష్. తన ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా ఉంటుందని జగన్ భ్రమ పడుతున్నారని, ప్రజా ప్రభుత్వంలో తప్పులు చేయం, ఎవరినీ చేయనివ్వమన్నారు లోకేష్. తల్లికి వందనం సక్సెస్ కావడంతో జగన్కుకడుపు మంట పెరిగిందని అందుకే..ఇలా తన మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కడుపు మంట తగ్గించుకునేందుకు నేనే స్వయం 2 ఈనో ప్యాకెట్లను పంపిస్తా.. నీళ్లలో కలుపుకొని తాగండి..కడుపు మంట కొంతైనా తగ్గుతుందంటూ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తప్పుడు ప్రచారాలపై చాలా సీరియస్గా ఉన్నారు లోకేష్. తల్లికి వందనం పథకంలో రెండు వేలు లోకేష్ ఖాతాలోకి వెళ్తున్నాయంటూ ఇటీవల వైసీపీ చేసిన ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.