లాక్ డౌన్ లో వచ్చిన బ్రేక్ తో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండేందుకు ఆయన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో జాయిన్ అయ్యారు. ఇటీవలే గడ్డం, మీసాలు తీసేసి యంగ్ లుక్ తో ఉన్న పిక్ ను షేర్ చేసి అభిమానులకు చిరు సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా ఆయన మరో లుక్ ను విడుదల చేశారు. ఈ లుక్ ఎవరూ ఊహించి ఉండరు.
42 సంవత్సరాల కెరీర్ లో చిరంజీవిని ఎప్పుడూ ఈ లుక్ లో చూసి ఉండము. అలాంటిది ఏకంగా ఆయన గుండు లుక్ లో దర్శనమిచ్చారు. బ్లాక్ గాగుల్స్ తో చిరంజీవి లుక్ చూసి అభిమానులే గాక ఇండస్ట్రీ వర్గాలు షాక్ కు గురయ్యాయి. ఈ పిక్ కి చిరు “నేను ఒకవేళ సన్యాసిలా ఆలోచిస్తే” అంటూ కామెంట్ యాడ్ చేశారు. దీనిపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో చర్చించుకుంటున్నారు.
మెగాస్టార్ న్యూ మూవీ ఫోటో షూట్ అంటూ కొందరూ కామెంట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం చిరు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకే ఇలా చేశాడంటూ కామెంట్ చేస్తున్నారు. దీనిపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేంత వరకు మనం ఆగవలసిందే. కరోనా ఉదృతితో ఇంటి వద్దనే ఉంటున్న చిరంజీవి ‘అన్ లాక్ 4.0’లో విదేశాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. విదేశాలకు వెళ్లకముందే చిరంజీవి మూడు సినిమాలను లైన్ లో పెట్టేశారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న చిరంజీవి తన తరువాతి ప్రాజెక్టులుగా వేదాళం, లూసిఫర్ రీమేక్ లు చేస్తున్నారు.