ఎమ్మెల్యే ధర్మశ్రీపై విజయసాయికి ఫిర్యాదు చేసిన మహిళ!
న్యాయం వైపు నిలబడాల్సిన చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ తనకు అన్యాయం చేస్తున్నారని దేవి అనే బాధిత మహిళ ఎంపీ విజయసాయికి ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రతినిధులు సేవ చేయాల్సింది మాని, అన్యాయం వైపు నిలబడి.. సామాన్యులను వేదించడం ఏమిటని దేవి నిలదీసింది. అనకాపల్లికి చెందిన దేవి అనే మహిళ తన పొలానికి పాస్ బుక్ ఇవ్వకుండా ధర్మశ్రీ అడ్డుకుంటున్నారని వాపోయింది. ఆ పొలం తన అనుచరుడు కావాలని అడుగుతున్నారని, దాని మరిచిపో అని బెదిరిస్తున్నారని దేవి విజయసాయి ప్రజాదర్బార్ కు ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేసే వరకు తన పోరాటం ఆపనని చెప్పింది దేవి.
ప్రజా దర్బార్ కు హాజరైన ఎమ్మెల్యే ధర్మశ్రీ..!
విశాఖలో ఎంపీ విజయసాయి కార్యాలయంలో జరిగే ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పై దేవి అనే బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని, తన పొలానికి పాస్ బుక్ ఇప్పించాల్సిందిగా దేవి వేడుకుంది. దీనిపై విచారణ చేపట్టిన ఎంపీ విజయసాయి.. ఎమ్మెల్యే ధర్మశ్రీని ప్రజాదర్భార్ కు పిలిపించాడు. పాస్ బుక్ జారీ చేస్తున్న విషయంలో తనమే అడ్డుకోవడం లేదని, అసలు ఆ విషయం తన దృష్టిలోనే లేదన్నారు ధర్మశ్రీ. కుటుంబ వివాదాలను రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. నిత్యం ఏదోఒక అంశంపై వార్తల్లో నిలిచే ధర్మశ్రీ మరోసారి ఇలా ల్యాండ్ డీలింగ్ విషయంలో వార్తలొకెక్కారు.