చట్టాలను గౌరవిస్తా..!
వ్యక్తులకన్నా.. చట్టాలనే అధికంగా గౌరవిస్తానని ఎంపీ రఘురామ కృష్ణరాజు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వచ్చి నోటీసులివ్వండపై ఎంపీ రఘురామ తీవ్రంగా స్పందించారు. సంక్రాంతి పండుగ నాడు తన సొంత నియోజకవర్గంలో బందుమిత్రులతో కలిసి ఆనందంగా గడపాల్సిన సమయానా.. తనను సీఐడీ విచారణకు రామ్మని చెప్పడం విచారకరమన్నారు. ఈ నెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని చెప్పడం తనను మానసికంగా హింసించడానికే అని వాపోయ్యారు. గతంలో అరెస్ట్ చేసినప్పుడు కూడా సీసీటీవీ కెమెరాలు లేకుండా విచారించారని, సిఐడీ సిబ్బంది తనపై వ్యక్తి గత దాడికి పాల్పడ్డారని చెప్పారు. తనను కొట్టి, చిత్రహింసలకు గురిచేసేది లైవ్ లో కొంతమంది అధికార పార్టీ ప్రముఖులకు చూపారని రఘురామ అవేదన వ్యక్తం చేశారు. అలానే సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అని, ఇదంతా చూసి జగన్ రెడ్డి ఆనంద పడుతున్నారని ఎంపీ రఘురామకృష్టరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా రాజీనామాతో ఏపీలో నూతన రాజకీయ అధ్యాయం..!
ప్రజా వ్యతిరేకత అధికారపార్టీ వైసీపీపై ఏ స్థాయిలో ఉందో తన రాజీనామాతో అర్థమౌతోందని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ వ్యాఖ్యలు సర్వత్ర ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎప్పటీ నుంచో రఘురామ తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. ఈనేపథ్యంలో తాను బీజేపీ లేదా జనసేన లో చేరాలని భావిస్తున్నారు. ఎందుకంటే రెండు పార్టీలు పొత్తులో ఉన్న సందర్భంగా తనకు పూర్తి మద్దతు లభిస్తోందని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు, బీజేపీ, జనసేన ఓట్లతో పాటు టీడీపీ కూడా రఘురామకు సాహకారం అందించేలా కనిపిస్తోంది! దీంతో నర్సాపురం పార్లమెంట్ స్థానంలో రఘురామ విజయం రాష్ట్రంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బహిర్గతంకాక తప్పదు! అందుకే రఘురామ తన రాజీనామాతోనే ఏపీలో నూతన రాజకీయ అధ్యాయం మొదలవుతోందని భావిస్తున్నారు. అలానే తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానినని .. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడినని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ నోటీసులపై స్పందిస్తూ.. రఘురామ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారాయి. వైసీపీకి గుడ్ బై చెప్పిన అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారని ఊహగానాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి.