తిరుమల తిరుపతి దేవస్థానానికి నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ విరాళం ఇవ్వనున్నాడు. ఈనెల 21న దేవాన్ష్ పుట్టినరోజు వేడుక. పుట్టిన రోజును పురస్కరించుకొని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా తిరుమలను సందర్శించుకోనున్నారు. దేవాన్ష్ పేరిట టీటీడీ అన్నదానం ట్రస్టుకు రూ.30 లక్షలు విరాళం అందించనున్నట్టు బాబు ప్రకటించారు. ప్రతి సంవత్సరం దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా బాబు ఫ్యామిలీ విరాళాలు ఇవ్వడం అనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా విరాళం ఇవ్వనున్నారు. చంద్రబాబుకు ఏమాత్రం సమయం దొరికినా మనవడు దేవాన్ష్ తో గడుపుతుంటాడు. చిన్న పిల్లాడిలా మారి ఆడుకుంటాడు. మనవడితో సందడి చేస్తూ సరదాగా గడుపుతుంటాడు.
Also Read :టీటీడీ ఈవో సింఘాల్ ఆకస్మిక బదిలీ అందుకేనా?











