కరోనా కాలంలో అన్ని రాష్ట్రాలది ఒకదారి అయితే, ఏపీది మరోదారి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నేటి నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇచ్చింది. అయితే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ‘దశలవారీ మద్యనిషేధం చేస్తామంటిరి కదా వైఎస్ జగన్ గారు.. దశలవారీగా మద్యం అమ్మకం వేళలు మారుస్తూ.. తెల్లారి పాల ప్యాకెట్లు అమ్మే సమయానికి ముందే మద్యం షాపులు తెరిచి ఏం సందేశం ఇస్తున్నారు?’ అని లోకేశ్ అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
కరోనా మందుల్లేక ప్రాణాలు పోతున్నాయంటే, నా సొంత బ్రాండ్ మందు ప్రెసిడెంట్ మెడల్ తాగమంటున్నట్టుంది మీ ఎవ్వారం. బెడ్లు,ఆక్సిజన్,వ్యాక్సినేషన్ గాలికొదిలేసి లిక్కర్ షాపులు 6 గంటలకే తెరిచి ప్రజల్ని దోపిడీ చెయ్యడానికి ప్రభుత్వం పరితపించడం దారుణం.(2/2)
— Lokesh Nara (@naralokesh) May 5, 2021











