ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు మరో గుడ్న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. ఏటా DSC నిర్వహిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ, మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉగాది పండుగను నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే రోజుగా మార్చేందుకు, కొత్త DSC నోటిఫికేషన్తో పాటు మెగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత మెగా డీఎస్సీలో మిగిలిన పోస్టులతో పాటు కొత్త ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా లోకేష్ వేగంగా అడుగులు వేస్తున్నారు.
పాఠశాల విద్యాశాఖ లెక్కల ప్రకారం, ఈ ఉగాదికి సుమారు 3,600 పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో 1,700 పోస్టులు..ఆదర్శ, సంక్షేమ పాఠశాలల్లో మరో 12వందల పోస్టులు, ప్రత్యేక విద్యా విభాగంలో 700 పోస్టులు ఉన్నాయి. సిలబస్లో, పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. పాత పద్ధతిలోనే పరీక్షలు జరుగుతాయని మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇవ్వడంతో అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లయింది.
కేవలం టీచర్ పోస్టులే కాదు, రాష్ట్రంలోని అన్ని రకాల ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ను లోకేష్ సిద్ధం చేశారు. యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి తోడు, ఐటీ మరియు భారీ పరిశ్రమల ద్వారా ఈ ఏడాదిలోనే ఏకంగా 2 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నారు. యువతకు గ్లోబల్ రేంజ్లో ఉపాధి దక్కాలని ఏఐ ఆధారిత స్కిల్ పోర్టల్ను సైతం త్వరలోనే ప్రారంభించబోతున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల నుంచి భారీ ఉద్యోగ ప్రకటనల వరకు లోకేష్ చూపుతున్న చొరవ నిరుద్యోగ యువతలో భరోసా నింపుతోంది. ఓ పక్క ఐటీ హబ్ల ఏర్పాటు, మరోపక్క ప్రభుత్వ ఉద్యోగాల జాతరతో ఏపీ యువతకు అండగా నిలుస్తున్నారు. మొత్తంగా ఉగాది నుంచి రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది.











