తమిళంలో క్రితం ఏడాది చివర్లో వచ్చిన ‘అసురన్’ సినిమా, సంచలన విజయానికి సరైన అర్థం చెప్పింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించడమే కాదు, నటనపరంగా ధనుష్ కి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను తెచ్చిపెట్టింది. లుక్ పరంగా .. బాడీ లాంగ్వేజ్ పరంగా .. డైలాగ్ డెలివరీ పరంగా కొత్తదనంతో కూడిన ఈ పాత్ర, ధనుశ్ కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచింది. దాంతో ఈ కథపై .. ఈ పాత్రపై చాలామంది మనసు పారేసుకున్నారు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం చాలామంది నిర్మాతలు పోటీపడ్డారు. చివరికి సురేశ్ బాబు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారు.
Must Read: నవంబర్ లో ‘నారప్ప’ తదుపరి షెడ్యూల్
‘అసురన్’ రీమేక్ కి ‘నారప్ప’ అనే టైటిల్ ను ఖరారు చేసి, వెంకటేశ్ కథానాయకుడిగా
దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించే సమయానికే ఈ సినిమా 70 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఆ తరువాత లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గుతూ ఉండటంతో, తదుపరి షెడ్యూల్ షూటింగు నిమిత్తం ఈ సినిమా టీమ్ తిరిగి రంగంలోకి దిగింది. మిగతా 30 శాతం షూటింగును సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో వున్నారు.
తాజా షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. వెంకటేశ్ .. ఇతర ముఖ్య తారాగణం పాల్గొనగా ఒక కీలకమైన సన్నివేశాన్ని నిన్న చిత్రీకరించినట్టు సమాచారం. ఈ సీన్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు. ఒక కథానాయికగా ప్రియమణి నటిస్తుండగా, మరో కథానాయికగా మలయాళ నాయిక ‘రెబా మోనిక జాన్’ కనిపించనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వెంకటేశ్ కెరియర్లోనే ‘నారప్ప’ వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచిపోతుందనేది అభిమానుల అభిప్రాయం.
Also Read: నిఖిల్ సరసకు మలయాళ కుట్టి











