తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉంటూనే కొందరు నిర్మాతలు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గ్రూప్ అంటూ సొంత కుంపటి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే, ఈ గ్రూపునే ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని సినీ జనాలు పిలుస్తుంటారు. ఈ గ్రూపులో మెంబర్ షిప్ ఉన్న నిర్మాతలందరూ ఓ ఫర్మ్ పెట్టి దాని ద్వారా సినిమా పబ్లిసిటీకి సంబంధించిన వ్యవహారాలు జరిగేలా ఏర్పాటు చేసుకున్నారు.
సినిమా పబ్లిసిటీ టైమ్ లో టీవీ ఛానల్స్ లో వేసే యాడ్స్ కి డిస్కౌంట్ కావాలంటే ఈ గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫర్మ్ ద్వారానే ఇవ్వాలి. ఎవరైనా నిర్మాత సొంతంగా యాడ్స్ వేసుకోవాలంటే ఛానల్స్ వారు డిస్కౌంట్ ఇవ్వనే ఇవ్వరు. దీంతో తెలుగు సినిమా తీసే ప్రతి నిర్మాత గిల్డ్ ద్వారానే తమ పబ్లిసిటీ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు తాజాగా కొత్త రూల్ పెట్టారు గిల్డ్ ప్రొడ్యూసర్స్, తమ మెంబర్స్ కి మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. దీంతో 18 వేలు మెంబర్ షిప్ కట్టి మరీ చాలా మంది నిర్మాతలు ఈ గిల్డ్ గ్రూపులోకి ఇష్టం లేకపోయినా వచ్చి చేరుతున్నారు.
ఈ గ్రూపుకి ఇంత హోల్డ్ రావడానికి అసలు కారణం ఇందులో ఉన్నది చాలా మంది బడా నిర్మాతలే, అల్లు అరవింద్, సురేశ్ బాబు, దిల్ రాజు తదితరలు ఈ గ్రూపు మెంబర్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే మరి ఏమైందో ఏమో ఈ మధ్య గిల్డ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఓ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలిసింది. అలానే ఓ ఓటిటి ఫ్లాట్ ఫామ్, ఫిల్మ్ వెబ్ సైట్ ఇలా అన్ని మాధ్యమాల్లో తమ ఖాతా తెరవడానికి ఈ గ్రూపు సభ్యులు నిర్ణయించుకున్నారని సమాచారం.