నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మొదటి నుంచి సరికొత్త పంధాలో ప్రవర్తిస్తున్నారు. తన ప్రత్యేక శైలిలో వ్యవహరిస్తూ.. ఎవరు ఏమన్నా అనుకోండి.. నా పని నాది అన్నట్లుగా.. తన వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర పర్యటనకు సిద్దమయ్యారు నిమ్మగడ్డ. 13 జిల్లాల్లో పర్యటించి అధికారులకు దిశానిర్ధేశం చేయనున్నారు. రేపటితో మొదలుపెట్టి.. మూడు రోజుల పాటు.. అధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నారు.
తాజాగా మున్సిపల్ ఎన్నికలకు కోర్టు గ్నీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మున్సిపల్ ఎన్నికలపై అధికారులను సమాయత్తం చేయడానికి ఈ పర్యటన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
Must Read ;- పురపాలికల్లో ఏకగ్రీవాల పరిశీలన.. వైసీపీకి నిమ్మగడ్డ షాక్











