ఈ మధ్య వరుసగా పాన్ ఇండియా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం పూజా హెగ్డే కథానాయికగా ‘రాధే శ్యామ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఇటలీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. వైవిధ్యమైన ప్రేమకథాంశంతో ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.
ప్రభాస్ అనగానే ఆడియెన్స్ యాక్షన్ సన్నివేశాలను ఫైట్స్ సీక్వెన్స్ ని ఎక్కువగా కోరుకుంటారు. అయితే ‘రాధేశ్యామ్’ లో మాత్రం అలాంటి యాక్షన్ సీన్స్, ఫైట్స్ సీక్వెన్స్ ఉండవని సమాచారం. కళాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. ప్రభాస్ సినీ కెరీర్ లోనే ఈ సినిమా ఒక మైలు రాయిలా నిలిచిపోతుందని ఈ మధ్య దర్శకుడు తెలిపాడు. ఇప్పటి వరకు ప్రభాస్ ఇటువంటి ప్యూర్ లవ్ స్టోరీని టచ్ చేయలేదని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాను కూడా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
ఈ చిత్ర షూటింగ్ ను త్వరగా ముగించుకొని వెంటనే ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలతో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఇటీవలే ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఈ మూడు సినిమాలపైన ఒక క్లారిటీ వచ్చే సూచనలు కనపడుతున్నాయని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు.