ఏపీలోని నెల్లూరు జిల్లా కొడవూలురు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంతో కత్తి మహేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కత్తి ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. ముందుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కత్తి మహేశ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను దాదాపుగా పూర్తిగా దెబ్బ తినడంతో పాటు ముఖానికి కూడా పలు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలించారు. అయితే మొదట్నుంచీ కత్తి మహేశ్ అనగానే పవన్ ఫ్యాన్స్ కు విపరీతమైన ద్వేషం ఉండేది. తన అభిమాన నాయకుడిపై తరచుగా విమర్శలు చేస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ కక్ష కట్టారు. బెదిరింపు కాల్స్ కూడా చేశారు. కొంతమంది అభిమానులయితే.. ఏకంగా దాడికి దిగే ప్రయత్నాలు కూడా జరిపారు. అయినా కూడా కత్తి మహేశ్ పవన్ సినిమాలపై తన అభిప్రాయాలను నిరభ్యంతరంగా వ్యక్తం చేసేవారు.
మానవత్వం చూసిన ఫ్యాన్స్
కత్తి మహేశ్ తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కొంతమంది పవన్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేయడం ఆసక్తి రేపుతున్నాయి. చావు బతుకుల్లో ఉన్న కత్తి మహేశ్ పై సానుభూతి వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేశారు. ప్రాణం ఎవరికైనా ప్రాణమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అవతలి వ్యక్తి బద్ధ శత్రువైనా.. మా గురువు ప్రేమించడం నేర్పించారంటూ మానవత్వం ప్రదర్శిస్తున్నారు. ”కత్తి మహేష్ గారు కోలుకోవాలని నా శ్రీరాముణ్ణి వేడుకుంటున్నాం. ప్రాణం ఎవరికైనా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారు మాకు ద్వేషించడం నేర్పలేదు. శత్రువుని అయినా క్షమించు అని నేర్పించారు” అని ఓ అభిమాని ట్వీట్ చేయడం వైరల్ అవుతోంది. కష్టకాలంలో కత్తి మహేశ్ పై పవన్ ఫ్యాన్స్ చూపుతున్న ప్రేమకు సినీవర్గాలు ఫిదా అవుతున్నాయి.
కత్తి మహేష్ గారు కోలుకోవాలని నా శ్రీరాముణ్ణి వేడుకుంటున్న…👏🏼👏🏼
ప్రాణం ఎవరికైనా ఒకటే….మాకు ద్వేషించాడం నేర్పలేదు పవన్ కళ్యాణ్ గారు శత్రువుని అయిన క్షమించు అని నేర్పించారు పవన్ కళ్యాణ్ గారు..
Get well soon #KathiMahesh pic.twitter.com/55UfRNZGJm— Manikanta kota (@IAMSHIVOLIC) June 26, 2021











