పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు.. వీరిద్దరూ కెరీర్ బిగినింగ్ లో నువ్వా నేనా అన్నట్టు బాక్సాఫీస్ దగ్గర పోటీపడేవారు. అభిమానుల మధ్య పోటీ గురించి చెప్పనక్కర్లేదు. అయితే.. వీరి సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ.. వీరిద్దరూ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. మహేష్ నటించిన అర్జున్ సినిమా పైరసీ జరిగినప్పుడు పైరసీ సీడీలు అమ్ముతున్న షాపును మహేష్ పట్టుకోవడం.. అప్పట్లో సంచలనం అయ్యింది. ఆ టైమ్ లో మహేష్ కి పవన్ అండగా నిలిచారు. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా జల్సా. ఆ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
పవన్ పై ఉన్న అభిమానంతో మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది అప్పట్లో ఓ సంచలనం. ఈ రెండు సంఘటనలు పవన్ – మహేష్ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియచేస్తాయి. ఇదిలా ఉంటే… క్రిస్మస్ సందర్భంగా పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు.. మహేష్, నమ్రత దంపతులకు క్రిస్మస్ గిఫ్ట్ లు పంపించారు. ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ.. పవన్ దంపతులకు ధ్యాంక్స్ తెలియచేసింది. అంతే కాకుండా.. పవన్ దంపతులు పంపిన గిఫ్ట్ లను ఫోటోలు తీసి పోస్ట్ చేసారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Must Read ;- పవన్ ‘పోలెనా’ ఆ కళ్లు, ఆ నడక.. సేమ్ టు సేమ్