బ్రిటన్లో కొత్తరకం కరోనా శరవేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అది తెలుసుకున్న వెంటనే విమానాలను రద్దు చేసింది మన ప్రభుత్వం. అక్కడి నుండి వస్తున్న వారిని కచ్చితంగా టెస్టులు నిర్వహించి కానీ ఎయిర్ పోర్ట్ దాటనివ్వకూడదని కేంద్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు జారీ చేసింది. దాని వల్ల ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో దాదాపు 8 గంటల పాటు ప్రయాణికులు కరోనా రిపోర్ట్స కోసం ఎదురుచూస్తూ ఉండిపోవాల్సి వస్తోందని ప్రయాణికులు అసహనం కూడా వ్యక్తం చేస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతటి జాగ్రత్తలు తీసుకున్న భారత్లో పలు ప్రాంతాల్లో కొత్త కరోనా కలకలం సృష్టించిడం అధికారులను కలవరపెడుతుంది.
పలు ప్రాంతాల్లో కరోనా కేసులు
బ్రిటన్ నుండి వచ్చిన వారిలో ఇప్పటికే చాలామందిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నారు. తాజాగా బ్రిటన్ నుండి ఢిల్లీ చేరుకున్న 266 మంది ప్రయాణికుల్లో 5 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. వీరితోపాటు 7 మంది సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరితోపాటు కొలకత్తా ఎయిర్ పోర్ట్ లో ఇద్దరికి, చెన్నైలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒడిశా కూడా ఒక కేసు నమోదైంది. వీరందరికి కరోనా అని తేలినా.. అవి కొత్త కరోనా లక్షణాలా కాదా తెలుసుకోవడానికి వారి నమూనాలను పుణెకి పంపావు. అక్కడి రిపోర్ట్స అందిన తర్వాతే వారికి కొత్త కరోనా లేదా మామూలు కరోనా అనేది నిర్ధారణ చేస్తామని అధికారులు వెల్లడించారు.
Must Read ;- ప్రపంచానికి షాకిచ్చిన లండన్.. మరో రకం కరోనాను గుర్తించినట్లు వెల్లడి

తెలుగురాష్ట్రాల్లో కొత్త కరోనా ప్రకంపనలు
తెలుగురాష్ట్రాల్లోనూ కొత్త కరోనా కలకలం సృష్టిస్తుంది. బ్రిటన్ నుంచి ఈ నెల 21న ఢిల్లీ చేరుకున్న ఓ మహిళకు ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ పాజిటివ్ రావడంతో వారిని క్వారంటైన్లో పెట్టారు. ఆమె అక్కడ నుంచి తప్పించుకుని ఏపీ ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రి చేరుకున్నారు. అప్రమత్తమైన ఏపీ అధికారులు స్టేషన్ రైలు దిగగానే ఆ మహిళను క్వారంటైన్కి తరలించారు.
బ్రిటన్ నుండి కరీంనగర్కు 16 మంది వచ్చారు. వారిలో 10 మంది శాంపిల్స్ సేకరించిన అధికారులు. మరో 6 గురి ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్రిటన్ నుండి ఉమ్మడి ఆదిలాబాద్కు వచ్చిన 5గురి లో ముగ్గర్ని గుర్తించిన అధికారులు వారి నుండి శాంపిల్స్ సేకరించారు. యూకే నుండి నిర్మల్ కు వచ్చిన మరో ఇద్దరు. వారి శాంపుల్స్ కూడా సేకరించి.. ఐదుగురిని క్వారంటైన్ తరలించారు అధకారులు. ఈ రోజు సాయంత్రానికి వారి రిపోర్ట్స అవకాశాలు ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లాలో యుకే నుండి వచ్చిన 270 మందికి గానూ 70 మందికి పరీక్షలు నిర్వహించిన అధికారులు. అందులో కొందరి శాంపిల్స్ సేకరించే పనిలో ఉండగా.. మరికొందరి ఆచూకీ కోసం ఆధికారులు ప్రయత్నిస్తున్నారు. లండన్ నుండి వచ్చిన వారు తమంత తాముగా వచ్చి కొవిడ్ పరిక్షలు చేయించుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. యుకే నుండి వచ్చిన వారిని ట్రేస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నయాని అధికారులు చెప్తున్నారు.
Also Read ;- అసలు ‘కొత్త రకం’ అంటే ఏమిటి? ఎలా వ్యాపిస్తుంది? అత్యంత ప్రమాదకరమా?











