సినిమా అన్నాక విడుదల అయ్యే మార్కెట్ ను బట్టి దానికి ఓ లిమిట్ ఉంటుంది. ఎంత పెద్ద హీరోల సినిమాలు అయినా తెలుగులో మాత్రం విడుదల అయితే ఒక స్థాయి వరకు, పాన్ ఇండియా అయితే మరో స్థాయి వరకు కలెక్షన్ల సునామీలు సృష్టించగలవు. ఆ మార్కెట్ రేంజిని బట్టి మాత్రమే ఆయా హీరోల చిత్రాల మీద నిర్మాతలు పెట్టుబడిపెడతారు. కానీ.. ఓటీటీ సంగతేంటి? ఒక అత్యద్భుతమైన చిత్రాన్ని అందిస్తే.. ఓటీటీ ప్లాట్ ఫాం.. ఏ స్థాయి వరకు దానికి ధర చెల్లించగలుగుతుంది. ఇది ఇంకా లెక్క తేలలేదు. కానీ.. పవన్ కల్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ ఓటీటీ సత్తా ఏంటో తేల్చేస్తుందనే చర్చ ఫిలింవర్గాల్లో నడుస్తోంది.
రాజకీయాల్లోకి వెళ్లాక ఇక తన సినిమా జీవితాన్ని వదిలేసానంటూ వాగ్ధానం చేసిన పవన్ కళ్యాణ్, ఇచ్చిన మాట్ వెనక్కి తీసుకొని మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రావడంతోనే హిందీ, తమిళ భాషల్లో విజయవంతమైన పింక్ సినిమా తెలుగు రీమేక్ లో హీరోగా నటిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు వకీల్ సాబ్ అనే టైటిల్ తో ప్రొడ్యూస్ చేశారు. సినిమా షూటింగ్ మొత్తం దాదాపుగా ముగిసిపోయింది. ఈ సినిమా చేసినందుకు పవన్ కు దాదాపుగా 50 కోట్లు రెమ్యూనీరేషన్ అందినట్లు సమాచారం.
అయితే తమ అభిమాన హీరో సెకండ్ ఇన్నింగ్ లో రాబోతున్న మొదటి సినిమా వకీల్ సాబ్ కు ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. దిల్ రాజు నిన్న మొన్నటి వరకు థియేటర్ లో వకీల్ సాబ్ రిలీజ్ అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికీ ఇప్పుడప్పుడే కరోనా భయం జనాల్లో పోయే పరిస్థితి అలానే వారంతా థియేటర్స్ కి వచ్చే అవకాశం లేకపోవడంతో వకీల్ సాబ్ ను డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఇప్పటికే ఇదే బ్యానర్ లో తెరకెక్కిన నాచురల్ స్టార్ నాని వి సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి రెడీ అయిపోయింది. దీని తరువాత వకీల్ సాబ్ ను కూడా మంచి రేటు వస్తే ఓటిటి డైరెక్ట్ రిలీజ్ చేద్దామని దిల్ రాజు అనుకుంటున్నట్లుగా తెలిసింది. ఈ విషయం పై ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ గ్రూపుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది.
కొందరు పీకే ఫ్యాన్స్ ఈ సినిమాను డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేసి, ఆ ఫ్లాట్ ఫామ్ లో కూడా పీక్ పేరిటి కొత్త రికార్డులు నెలకొల్పడానికి ఉత్సాహం చూపుతుంటే, మరికొందరు ఎట్టి పరిస్థితుల్లో వకీల్ సాబ్ బోమ్మ థియేటర్ లో పాడాల్సిందే అని పట్టుబడుతున్నారు. అయితే పవన్ మాత్రం ఈ విషయంలో ఏ మాట్లాడకుండా ఆ నిర్ణయాన్ని దిల్ రాజు చేతికే వదిలేయడం కొసమెరుపు.