ఫైర్ బ్రాండ్ పై పబ్లిక్ ఫైర్..
అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నగరి ఎమ్మెల్యే రోజాకు ప్రస్తుతం చేటుకాలం దాపురించినట్లు కనిపిస్తోంది! నియోజకవర్గ పరిథిలో కేడర్ రోజాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ సమావేశాలు పెట్టి రోజా తీరును కేడర్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నగరిలో రోజా నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించడమేకాక, కేడర్ ఫాలో కావడం లేదు అన్నది అందరికి తెలిసిందే. ఇటీవల రోజాను సంప్రదించకుండానే శ్రీశైలం బోర్డు ఛైర్మన్ గా రెడ్డివారి చక్రపాణి రెడ్డిని నియమించింది పార్టీ! దీంతో రోజాకు తలకొట్టేసినంత పనైంది. నిండ్రా మండలానికి చెందని చక్రపాణి రెడ్డికి ఎమ్మెల్యే రోజాకు మధ్య ఏర్పడిన అంతరం ఈ నాటిది కాదు. చక్రపాణి వర్గం ఎమ్మెల్యే రోజా నిర్ణయాలను వ్యతిరేకిస్తూ..మండలంలో రాజకీయాలను శాసిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యే రోజా, చక్రపాణి రెడ్డి మధ్య రాజుకున్న వివాదాల వేడి నేటికి కొనసాగుతూనే ఉంది. చివరికి పేరుకే ఎమ్మెల్యే పదవిలో రోజా కొనసాగుతున్నారేకానీ.. నియోజకవర్గంలో పెత్తనమంతా ఆ ఇద్దరి మంత్రులు, ద్వితీయ శ్రేణి నాయకులదే అన్నది అందరికి తెలిసిందే!
ప్రజాగ్రహంతో అవమానం..
‘మీతో మీ ఎమ్మెల్యే’ పేరుతో నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా పర్యటిస్తున్నారు. మండలం నిండ్రలో అగరంపేటలో బుధవారం రోజా తన పర్యటనను ప్రారంభించారు. డోర్ టూ డోర్ తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆమెను నిలదీశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ పథకంపై లబ్థిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పడో నిర్మించుకున్న ప్రభుత్వ ఇంటికి ఎందుకు పదివేలు చెల్లించాలని ప్రశ్నించారు. పది వేలు చెల్లిస్తే ఇల్లు సొంతమవుతుంది, ఎవరికైనా అమ్ముకొవచ్చని, బ్యాంకు రుణాలకు అర్హులవుతారని, ఇంటిపై పూర్తి హక్కులు వస్తాయని లబ్ధిదారులకు రోజా తమిళంలో వివరించే ప్రయత్నం చేశారు. అయినా రోజాకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేయడం గమనార్హం.
Must Read:-ఎమ్మెల్యే రోజాపై కార్యకర్తల ఆగ్రహం..! స్థాయిని మరచి మాట్లాడకు అంటూ హితవు..!!