కుంటిసాకులతో అనుమతి నిరాకరణ.. కోర్టును ఆశ్రయిస్తామన్న జేఏసీ నేతలు!
రైతుల తలపెట్టిన పాదయాత్ర 16న తిరుమలలో ముగుస్తోంది. ఆ రోజు వెంకటేశ్వరస్వామి వారి దర్శనం అనంతరం 17న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించేందుకు అధికారుల అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు రైతులు. సభకు నిర్వహించేందుకు అనుతివ్వలేదని అధికారులు చెప్పారు. దీంతో తిరుపతిలోనే ఓ ప్రైవేటు స్థలంలో సభకు అనుమతివ్వాలని పోలీసులను రైతులు కోరారు. అక్కడకూడా రైతు సభకు అనుమతిని నిరాకరిస్తూ… తిరుపతి అర్భన్ పోలీసులు రైతులకు లేఖ రాశారు. పాదయాత్రకు మాత్రమే హైకోర్టు అనుమతించిందని, పాదయాత్ర 42 రకాల ఉల్లంఘనలు జరిగాయని, పాదయాత్రపై చిత్తూరు జిల్లాకు చెందిన కొన్ని సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని, రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటే గొడవలకు ఆస్కారం ఉందని .. ఇలా కుంటిసాకులను చెబుతూ అనుమతులను నిరాకరిస్తాన్నామని పోలీసులు పంపిన లేఖలోని సారాంశం. పోలీసుల వర్షన్ ఇలా ఉంటే బహిరంగ సభ అనుమతి కోసం జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నట్లు అందుతున్న సమాచారం. తమకు జరిగిన అన్యాయాన్ని ఏపీ వ్యాప్తంగా సభలు నిర్వహించి చెప్పుకునే హక్కు తమకు ఉందని, అందుకు పోలీసులు అడ్డుపడడం సబబు కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ద్వారా సభకు అనుమతి సాధిస్తామని మరోపక్క న్యాయవాది లక్ష్మీనారాయణ మీడియాకు తెలిపారు.











