అడుగడుగునా అడ్డగింతలే!
ఏపీకి రాజధాని ఒకటే ఉండాలని గడిచిన రెండేళ్లు నుంచి రైతులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దూ .. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జగన్ రెడ్డి కుట్రలకు ధీటుగా బదులిస్తున్నారు. తుళ్లూరు వేదికగా రైతులు సాగిస్తున్న ఉద్యమాలకు పార్టీలకు అతీతంగా పలువురు మద్దతు ప్రకటించగా .. ఎందరో మేధావులు సంఘీభావం తెలిపారు. రాజధాని రైతు ప్రయోజనాలను కాలరాయడానికి కంకణం కట్టుకున్న జగన్ రెడ్డి, నిరసనలను, ఆందోళనలను తొక్కెయ్యాలని ఎన్నోరకాల పోలీసులు చర్యలకు పాల్పడ్డారు. కానీ సడలని రైతు ఆత్మస్థైర్యం .. ఈ నెల నవంబర్ 1 న తుళ్లూరు నుంచి ‘న్యాయంస్థానం టూ దేవస్థానం’మహాపాద్రయాత్రకు పిలుపునిచ్చింది. ఈ పాదయాత్రలకు ఒక్క వైసీపీ మినాహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా ఎంటర్ కాగానే అధికారపార్టీ కుట్రలకు తెరతీసింది. పోలీసుతో నీచ క్రీడకు పురికొల్పింది. అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ ..అడ్డుగోడలను నిర్మిస్తూ వస్తోంది. గురువారం ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతుల పాదయాత్రలో పోలీసులు అలజడి సృష్టించారు.
అడ్డగొలు ఆంక్షలే .. ఉద్రిక్తతలకు దారి .. !
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతులు మహాపాదయాత్రలో అధికారపార్టీ అలజడులు సృష్టించాడానికే పోలీసులను ప్రేరేపిస్తున్నట్లు కనిపిస్తోంది. నిర్వీరామంగా గత 11 రోజులుగా సాగుతున్న పాదయాత్రకు మద్దతునిచ్చి సంఘీభావం తెలిపేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు తరలివస్తున్నారు. అయితే కోర్డులో తీవ్ర కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయిలను ఎలగైతే పోలీసు వలయాల్లో తీసుకెళ్తారో అదేవిధంగా నాగులుప్పలపాడు లో ఎక్కడిక్కడ బారిగేట్లు ఏర్పాటు చేసి అడ్డుగా నిలబడ్డారు. చెక్ ఫోస్ట్ లను ఏర్పాటు చేసి, స్థానిలను అడ్డుకున్నారు. రైతులను కలిసేందుకు వీలులేదని హుకుం జారీచేయడంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన పోలీసులు లాఠీ అనే అధికార బెత్తాన్ని రైతులపై ప్రమోగించి, విచక్షణ రహితంగా దాడికి దిగారు. ఈ దాడులో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. పలువురు మహిళలు తోపులాటలో కిందపడిపోయారు. పలువురి గాయాలయ్యాయి.
అధికార లాఠీకి బుద్దిచెప్తాం!
అధికారపార్టీ ఆదేశాలను తూచా తప్పక పాటించే పోలీసు యంత్రాంగం.. రాజధాని రైతుల ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచే లాఠీలను దురుసుగా వాడటం మొదలుపెట్టారు. ఈ రోజు చదలవాడలో రైతులపై జరిగి లాఠీచార్జీ పై పలువురు స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం హేయనీయమన్నారు. పోలీసు లాఠీదెబ్బలకు గాయపడిన వారికి వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానం ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తలపెట్టిన పాదయాత్ర జగన్ రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని విమర్శించారు. పాదయాత్రను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా వారిని కూడా అడ్డుగించడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. అలానే పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తున్న అధికారపార్టీ ఆగడాలను అమరావతి బహుజన జేఏసీ నేత పోతుల బాలకోటయ్య ఖండించారు.











