ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ .. రాధేశ్యామ్ రొమాంటి లవ్ స్టోరీని, ఆదిపురుష్ అనే పౌరాణిక చిత్రాన్ని, సలార్ యాక్షన్ మూవీని ఒకేసారి ట్రాక్ మీద పెట్టాడు. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో విడుదల కాబోతున్నాయి. అంతేకాదండోయ్.. ఈ మూడు సినిమాలకు రిలీజ్ డేట్స్ లాక్ అయిపోయాయి. వాటిలో రాధేశ్యామ్ సినిమా ముందుగా విడుదల కావాలి లెక్క ప్రకారం. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండడంతో సినిమా వాయిదా పడింది. అలాగే.. మిగిలిన సినిమాల విడుదల తేదీల్లో కూడా మార్పులు రావచ్చని తెలుస్తోంది.
ఇక ప్రభాస్ సినిమాల్లో మరో మోస్ట్ ఎవటైడ్ మూవీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సైంటిఫిక్ థ్రిల్లర్. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందబోయే ఈ సినిమా లెక్క ప్రకారం ఈ జూన్ లో కానీ జూలైలో కానీ లాంఛ్ అవ్వాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చంటున్నారు. అందుకే ఈ సినిమాను దీపావళి రోజున లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట వైజయంతి మూవీస్ వారు.
అంటే ఈ ఏడాది నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్భతోంది అన్నమాట. ఆ తర్వాత కొద్దిరోజులకు రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తారట. ఈ లోపు కోవిడ్ వల్ల ఆగిన ‘ఆదిపురుష్, సలార్’ సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తాడట ప్రభాస్. కనీనం వీటిలో ఒక్కటైనా .. నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభం అయ్యేలోగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట. మరి నాగ్ అశ్విన్ సినిమా నిజంగానే దీపావళి రోజున సెట్స్ మీదకు వెళుతుందేమో చూడాలి.
Must Read : 1 మిలియన్ మార్క్ ను టచ్ చేసిన ‘జాతిరత్నాలు’