కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి తాజా చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. ఢిల్లీ ప్రసాద్ దీన దయాళన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ కామెడీ సెటైరికల్ మూవీపై బోలెడన్ని అంచనాలున్నాయి. విజయ్ సేతుపతి ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా ఆయన పాత్రను డిజైన్ చేశారు. నిజానికి ఇందులో కథానాయికగా ముందుగా అదితీరావు హైదరీ ని ఎంపికచేశారు. అయితే కొంత షూటింగ్ జరిగాకా చిత్రీకరణ ఆగిపోయింది.
దాంతో ఈ సినిమాకి ఇప్పుడు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అదితీరావు. ఇప్పుడు ఆమె ప్లేస్ ను రాశీఖన్నాతో రిప్లేస్ చేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఈ సినిమా మేకర్స్ . రాశీఖన్నా ఇంతకు ముందు విజయ్ సేతుపతి సరసన సంగతమిళన్ మూవీలో నటించి మెప్పించింది. ఇప్పుడు మరోసారి విజయ్ సేతుపతి సరసన నటిస్తున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది . ఈ సినిమాలో తనను కథానాయికగా ఎంపికచేసినందుకు మేకర్స్ కు ధన్యవాదాలు తెలిపింది.
డీ గ్లామర్ రోల్ లో నటించబోతున్న రాశీఖన్నా తో పాటు ఇందులో మలయాళ కుట్టి మంజిమా మోహన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. నెగెటివ్ షెడ్స్ లో ఉన్న ఓ వెరైటీ పాత్రలో పార్తీబన్ నటిస్తున్నాడు. వెంకీ మామ, ప్రతిరోజూ పండగ లాంటి సినిమాలతో హిట్స్ కొట్టి.. ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ తో ప్లాప్ టేస్ట్ చేసింది రాశీ. దాంతో ప్రస్తుతం రాశీఖన్నా తెలుగులో ఒక్క సినిమాలోనూ నటించడం లేదు. ప్రస్తుతం తన ఫోకస్ నంతటినీ తుగ్లక్ దర్బార్ మీదే పెట్టనుంది. మరి ఈ సినిమాతో రాశీ సక్సెస్ ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
Happy to announce that #RaashiKhanna is playing as female lead in @VijaySethuOffl 's #TughlaqDurbar 😊😊
Team #TughlaqDurbar welcomes you aboard @RaashiKhanna 💐💐@DDeenadayaln @Lalit_SevenScr @proyuvraaj pic.twitter.com/AR0aAcHZ0B
— Seven Screen Studio (@7screenstudio) October 20, 2020
Thankyou @7screenstudio ☺️
Very happy to be on board for #TughlaqDurbar and to be working with one of the finest actors we have @VijaySethuOffl Sir again! 😇 https://t.co/pR5TFkg2WZ— Raashi (@RaashiKhanna) October 20, 2020