కొరటాల సినమా అంటేనే ‘మిర్చి’ ఘాటు ఎక్కువ. ఎక్కడ తేడా వచ్చినా తట్టుకోలేం. పైగా ఆయన వచ్చింది పోసాని స్కూలు. దర్శకుడిగా కొరటాల శివ తీసిన అన్ని సినిమాలూ బిలియన్ క్లబ్ లో చోటు దక్కించుకున్నాయి. మిర్చి కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అందుకుంది. దీంతో కొరటాల శివ రాసే కథల్లో యాక్ట్ చేయాలని స్టార్ హీరోలు ట్రై చేస్తుంటే, డైరెక్ట్ చేసే సినిమాలు చూడాలని ఆశగా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. నేటి స్టార్ డైరెక్టర్స్ లో టాప్ 2 ప్లేస్ కైవసం చేసుకున్న కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం కొరటాల ఏకంగా రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. కథలో చాలా మార్పులు చేసిన తరువాతే ఈ చిత్ర యూనిట్ సెట్స్ మీదకి వచ్చింది. అయితే కరోనా క్రైసిస్ రాక ముందరే ఫిబ్రవరిలో ఈ సినిమా షూట్ చేయడానికి కొరటాల సన్నాహాలు చేసుకున్నాడు. చిత్ర నిర్మాత రామ్ చరణ్ 3 కోట్లు పెట్టి సెట్ కూడా వెయించాడు. అయితే అనుకోకుండా వచ్చిన మహమ్మారి కారణంగా ఆచార్య షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ షూట్ స్టార్ట్ చేద్దామనుకుంటే గతంలో 3 కోట్లు పెట్టి వేసిన సెట్ మొత్తం వర్షం పాలైపోయింది. దీంతో రామ్ చరణ్, స్టోరీ మార్చి షెడ్యూల్ దాని ప్రకారం వేయాలని కొరటాలని కోరినట్లు తెలిసింది.
రామ్ చరణ్ కోరికను కొరటాల సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. కొరటాల ఒప్పుకోకపోవడంతో రామ్ చరణ్ కాస్త ఫీల్ అయినట్లు సమాచారం. దీనికి తోడు కొరటాల సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసిన అల్లు వారి కాంపౌండ్ లోకి వెళ్లి పోవాలని చూస్తున్నడట, బన్నీతో చేయబోయే సినిమాకి స్క్రిప్టు వర్క్ అతి త్వరలో ప్రారంభించి సినిమా వచ్చే ఏడాది దసరాకి రిలీజ్ చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నటు తెలిసింది. ఈ వ్యవహారం పై కూడా రామ్ చరణ్ కొరటాల పై కాస్త సీరియస్ గా ఉన్నాడని సినీ జనాలు అంటున్నారు. చూడాలి మరి ఎవరి మాట నెగ్గుతుందో.