మొక్కల నాటే యజ్ఞంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా భాగమయ్యారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి చేయూనిచ్చారు. ఎందరో ప్రముఖులు ఇందులో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. బాహుబలి ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన రామ్ చరణ్ ఈరోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు.
జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు. ఇందులో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తన స్నేహితుడు ప్రభాస్ తనకు ఈ అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతిని మనం కాపాడితేనే ప్రకృతి మనం కాపాడుతుందని, ప్రకృతి సమతౌల్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీదా ఉందన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. బాలీవుడ్ హీరోయిన్ ఆలీయా బట్, దర్శకుడు రాజమౌళి, ట్రిపుల్ ఆర్ చిత్ర బృందం కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. మెగా ఫ్యామిలీ అభిమానులందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.