కరోనా కాలంలో నాలుగు సేద తీరే మాటలు చెబితే పోయేదేముంది. రేణు దేశాయ్ ఆ పనే చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె గ్రాములకొద్దీ వేదాంతాన్ని సామాజిక ప్రయోజనం కలిగేలా బోధిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్టు వైరల్ అవుతోంది. మనం జీవితంలో ఎన్నో బాధలను మోసి గాడిదల్లా తయారయ్యామని అని వాపోయింది. మనం బాధల్ని అనుభవించడానికే ఈ శరీరం కాదని, బాధల్లో కూడా సంతోషాన్ని వెతుకున్ని సంతోషించాలని ఆమె చెబుతోంది. మనుషులంతా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని, ఇలాంటి తరుణంలో మనసుకు కొంత ఉపశమనం కూడా అవసరమనేది ఆమె భావన. మనం ఆనందంగా ఉండటానికి ఏంతోస్తే అది చేయాలంటోందామె.
ఈ కరోనా కష్టకాలం ఎంతో కాలం ఉండదని, మనకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశావాదాన్ని బోధిస్తోంది. జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే చక్కటి కామెడీ వీడియోలు, పెంపుడు కుక్కపిల్లలు వీడియోలు చూస్తే మంచి కాలక్షపం జరుగుతుందట. కాలం చేతిలో మనం ఉన్నామేగాని మన చేతిలో కాలంలేదని, కాలం ఎటుతీసుకెళితే అటు మనం వెళ్లాల్సిందేనని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా ఉండాలంటూ మనకు మార్గదర్శకత్వాన్ని ఆమె నిర్దేశించారు. తను ఇచ్చిన చిన్న సందేశంలోనే అనంతమైన అర్థాన్ని పొందుపరిచి షేర్ చేశారామె.
Must Read ;- మళ్ళీ గబ్బర్ సింగ్, సాంబా కాంబినేషన్ ?











