బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులో రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలిది హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈరోజు రియా చక్రవర్తిని అరెస్టు చేయవచ్చన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. దానికి ముఖ్యకారణం ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు రియా ప్లాన్ రూపొందించడమే. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అధికారులు చాలామందిని విచారించారు. సుశాంత్ ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిందనే కోణంలోనే రియాను అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది.
ఈ కేసు నుంచి తను ఎలాగైనా బయటపడాలన్న ఉద్దేశంతో ఓ దర్శకుడితో కలిసి రియా ఓ మాస్టర్ ప్లాన్ ను రూపొందించిందని సమాచారం. ఆమెకు సహాయం చేయడానికి ఆ దర్శకుడు కూడా అంగీకరించినట్లు తెలిసింది. తన గురించి మీడియాలో పాజిటివ్ వార్తలు రావాలన్నది రియా ప్లాన్ లో ప్రధాన అంశం. దీనికి ఓ ప్రముక జర్నలిస్టు సహకారాన్ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ కూ, తనకూ మధ్య తండ్రీకూతుళ్ల లాంటి సంబంధం తప్ప మరే సంబంధమూ లేనట్లు కలరింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాట్సా ప్ స్క్రీన్ షాట్లను బాలీవుడ్ లోకి లీక్ కావాలనే లీక్ చేసినట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తికీ, ఆమె తండ్రికీ సీబీఐ సమన్లు జారీ చేసిందని సమాచారం. రియా చక్రవర్తి మోసం చేసి తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైందని సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి పాట్నాలో రియాపై కేసు పెట్టారు. ఆ కేసును సుప్రీంకోర్టు సమర్థించింది. బీహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ కేసును సుప్రీంకోర్టు గతవారం సీబీఐకి అప్పగించింది. ఇప్పటికే రియా చక్రవర్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండుసార్లు ప్రశ్నించింది. సీబీఐ ఆదివారం రాజ్పుత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని, అతని వంటమనిషి నీరజ్ ను ప్రశ్నించింది. నీరజ్ను వరుసగా మూడు రోజులు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) కార్యాలయంలో సీబీఐ అధికారులు విచారించారు. తమకు సీబీఐ నుంచి ఎలాంటి సమన్లూ అందలేదని ఆమె తరపు న్యాయవాది తెలిపారు.