పల్నాడు మొరటు రాజకీయాలకు చరమగీతం పాడేదెప్పుడు!
పల్నాడు ప్రాంతంలో ప్రతిపక్షాన్ని బతికనివ్వకూడదని అధికార పార్టీనేతలు కంకణం కట్టుకున్నారేమో కాబోలు .. ఎన్నికలు అంటే చాలు వారు చేసే హడవుడి అంతాఇంతా కాదు. గుంటూరు జిల్లా, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిథిలోని పల్నాడు బెల్టైనా గురజాల, మాచర్ల, వినుకొండ, నరసరావుపేట నియోజకవర్గాలలో ఎన్నికలు వస్తే చాలు .. పోలీసు బలగాలకు కంటిమీద కునుకుండదు. బెదిరింపులు, వ్యక్తిగత దాడులు షరా మాములే. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులు నిత్యకృత్యమేనని చెప్పవచ్చు. హత్యలకు సైతం వెనకాడటం లేదంటే .. పరిస్థితెంత చేయి దాటిపోయిందో కొన్ని సంఘటనలు చూస్తే అర్థమౌతోంది. ఏపిలో 13 చోట్ల నిర్వహించాల్సిన మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో భాగంగా నెల్లూరు కార్పోరేషన్ తోపాటు 12 మున్సిపాలిటీ కూడా ఉన్నాయి. అందులో పల్నాడు ప్రాంతంలోని గురుజాల, దాచేపల్లి మున్సిపాలిటీలతోపాటు మాచర్ల 8వ కౌన్సిలర్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన నాటినుంచి ప్రతిపక్ష పార్టీలపై, స్వతంత్ర అభ్యర్థులపై అధికారపార్టీ నాయకులు చేస్తున్న దాడులు అన్నీఇన్నీకావు. 2021 ఫ్రిబవరి 17 న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో రెంటచింతల మండలం, పాలువాయి గ్రామంలో అధికారపార్టీకి చెందిన నాయకునిపై పోటి చేసిన స్వపక్షం నాయకుడి కుటుంబాన్ని ఓ స్థాయిలో హింసకు గురిచేశారు. ఈ ఘటనలో పోలీసులే ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు వ్యవహించి, దాడులకు పాల్పడ్డారని టీడీపీ పెద్దఎత్తున ఆరోపించింది. ఇటువంటి దాడులకు చరమగీతం పాడాలి. రాజ్యాంగ కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే ప్రతి అంశాన్ని చట్టాలను పరిరక్షించే పోలీసులు చర్యలు తీసుకోవాలి. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజారణ్యంలో సత్ఫలితాలను ఇస్తాయంటున్న మీకు .. ఈ దాడులేలా అని అధికారపార్టీ చర్యలకు ప్రజలు విస్తుపోతున్నారు.
దాడులను సమర్థిస్తే సరిపోతుందా?
ఏ ఎన్నికల వచ్చిన ఎన్నికల అధికారులు, లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకు పోలీసుల పాత్ర వంటివి కీ – రోల్ పోషిస్తుంటాయి. అటువంటి అధికారులు విధులను మరిచి అధికారపార్టీకీ విజయానికి కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో అధికారపార్టీ ప్రతిపక్షాలపై అవలంబిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ప్రజాబాహుల్యంలో ప్రలోభాలు, బెదిరింపులు, దాడులు, పోలీస్ చర్యలు లేకుండా ఎన్నికల్లో విజయం అధికారపార్టీ సాధ్యంకాక ఈ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శలు కోడైకూస్తున్నాయి. అందుకు నిదర్శనమే గురజాలలో తెలుగుదేశంపార్టీ మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని చింపడం, దాడికి యత్నించడం. 8వ వార్డుకు నామినేషన్ వేసేందుకు వచ్చిన టీడీపీ మహిళా అభ్యర్ధి సుందరగిరి నజీమున్ వద్ద నుంచి నామినేషన్ పత్రాన్ని గుంజుకుని అధికారపార్టీకి చెందిన వ్యక్తి చింపేసి, నానా దుర్భాషలాడాడు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారే కానీ.. ఆ మహిళపై, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిని అడ్డుకోలేకపోయారు. వార్డుల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులను బెదిరిస్తున్నారు. నామినేషన్ వేస్తే అంతు చూస్తామని దాడులకు సైతం వెనకాడటంలేదు. ఇంతటి దౌర్భగ్య స్థితిలో ప్రజాస్వామ్య విలువలు దిగజారుతుంటే ఎన్నికల అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారు? అన్నదే సగటు ఓటరు ప్రశ్నా. చివరగా అధికారపార్టీ చేస్తున్న అకృత్యాలకు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న ఉదాసీనత వైఖరులను ప్రజలు గమనిస్తునే ఉన్నారన్నది మర్చిపోవద్దని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.