రాజమౌళి మల్టీస్టారర్ సినిమా ట్రిపుల్ ఆర్ విడుదల సమీపిస్తుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.తాజాగా ఈరోజు ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేశారు. 45 సెకన్ల నిడివి ఉన్న ఈ స్పెషల్ వీడియో చూస్తుంటే ఇందులోని హైలైట్ సన్నివేశాలను మేళవించి రూపొందించినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇందులోని హీరో పాత్రలతో గ్లింప్స్ రూపొందించారు. దానికి భిన్నంగా ఈసారి రామ్ చరణ్, తారక్ కలిసి ఉన్న సన్నివేశాలను చూపించారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారన్నది మనకు తెలిసిందే.
కానీ ఈ గ్లింప్స్ చూస్తే పోలీస్ వేషధారణలో రామ్ చరణ్ కనిపించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రల్లో ఉండే ఇంటెన్సిటీని ఈ గ్లింప్స్ ఆవిష్కరించింది. ఎంతో భారీతనంతో ఈ సినిమా రూపొందిందన్నది గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. అజయ్ దేవగన్ పాత్ర తాలూకు స్వభావాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. సీత పాత్రలో ఆలియా భట్ ఎలా ఉండబోతుందన్నది కూడా గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బహుశా ఈ గ్లింప్స్ ఇద్దరు హీరోల అభిమానులకూ దీపావళి కానుక అనుకోవచ్చు.
తారక్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ఎలా ఉండబోతుందన్నది ఇంకా చూపించే ప్రయత్నం చేయలేదు. సినిమా విడుదలయ్యే లోపు మరో గ్లింప్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. దాని తర్వాత టీజర్, ట్రైలర్ లు ఉండనే ఉన్నాయి. అన్నిటినీ ఇప్పుడే చూపించేస్తే ఇక చూపించడానికి ఏమీ మిగలదు. అందుకే గ్లింప్స్ ద్వారా ఊరించే ప్రయత్నం చేస్తున్నారు. అజయ్ దేవ్గణ్, శ్రియ, సముద్రఖని లాంటి భారీ తారాగణం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.
దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమా రూపొందినట్టు చెబుతున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. 1920 నాటి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కీరవాణి నేపథ్య సంగీతంలోనూ ప్రత్యేకత కనిపిస్తోంది. ఉదయం 11 గంటలకు ఈ వీడియో విడుదలగా కొద్ది గంటల వ్యవధిలోనే వ్యూస్ ను కొల్లగొట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల పక్కా అన్నది మాత్రం స్పష్టమవుతోంది.
Must Read ;- రాజమౌళి హీరోలు ముగ్గురితో ప్రశాంత్ నీల్











