రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ లుక్ పై బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవలే ఈ సినిమాలో ‘దోస్తీ’ పాట విడుదలైన సంగతి తెలిసిందే. యూట్యూబ్ లో వ్యూస్ ను ఈ పాట కొల్లగొడుతోంది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నఈ సినిమా అక్టోబరు 13న విడుదల కాబోతోంది. ఈ చిత్ర యూనిట్ ఓ పాట చిత్రీకరణ కోసం ఉక్రెయిన్ వెళ్లింది. ఇప్పటికే ఈ సినిమాపై భారతదేశంలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చిన అది ఓ సంచలనమే.
తాజా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ రామ్ చరణ్పై టీజర్ వదిలారు. ఆ తర్వాత మధ్యలో కొన్ని పోస్టర్లు ఇచ్చి.. ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ ఎన్టీఆర్పై టీజర్ వదిలారు. అవి రెండూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటి మధ్యలో వచ్చిన ఆలియా భట్, అజయ్ దేవ్గన్ల ఫస్ట్లుక్ కూడా వైరలైంది. ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ పాటలో సాహిత్యాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించారు. ఈ పాటకు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లు ఈ పాటను పాడారు. అయితే తాజాగా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద బాలీవుడ్ ఫల్మ్ అనలిస్ట్ కామెంట్ చేశారు. రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని ప్రశంసలు కురిపించారు. ‘ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ లుక్ స్టన్నింగ్గా ఉంది. ఆ మీసకట్టు, ఆ కళ్లలో పౌరుషం చూస్తుంటే మగధీరను మించిపోయేలా ఉంటుందనిపిస్తోంది’ అంటూ రాహుల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ అభిమనులు కూడా ఇలాంటి ట్వీట్లతో ముందుకు వస్తారేమో చూడాలి. సినిమా విడుదలకాబోయే ముందు రాజమౌళి చేపట్టే ప్రచార సరళి ఓ రేంజ్ లో ఉంటుంది.
Must Read ;- వ్యూస్ కొల్లగొడుతున్న ట్రిపుల్ ఆర్‘దోస్తీ’ పాట