SBI తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు SMS ఛార్జీలు కానీ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయనందుకు పెనాల్టీలు కానీ చెల్లించాల్సిన అవసరం లేదట.
ఇప్పటివరకు అయితే SBI అకౌంట్ ఉన్నవారు అర్బన్ ప్రాంతాల్లో ₹3000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ₹2000, గ్రామీణ ప్రాంతాల్లోని వారు అకౌంట్లో కనీసం ₹1000 ఉంచకపోతే గతంలో జరిమానా వేసేవాళ్లు. అటు SMS అలర్ట్స్ కోసం ప్రతి త్రైమాసికానికి ₹12+GST వసూలు చేసేవాళ్లు.
ఈ విషయాన్నీ స్వయంగా ట్విట్టర్ లో పేర్కొంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా