షర్మిల ఏప్రిల్ 9వ తేదీన తమ పార్టీ పేరును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దివంగత వైఎస్ఆర్ పాదయాత్ర ముగిసిన తేదీ ఇదే రోజు కావడంతో ఆరోజునే పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పార్టీ ప్రకటించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
వైస్ హయాంలోనే 90 శాతం ప్రాజెక్టులు పూర్తి
ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులు 90 శాతం వైఎస్ రాజశేకర్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని, తర్వాత వచ్చిన పాలకులు వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో గతకొన్ని రోజులుగా వైఎస్ షర్మిల తెలంగాణలోని పలు జిల్లాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మహిళలతోను, విద్యార్థులతోనూ సమవేశాలు నిర్వహించి వారి అభిఫ్రాయాలు తెలుసుకున్నారు.
షర్మిలను కలిసిన యాంకర్ శ్యామల..
యాంకర్ శ్యామల తన భర్తతో కలిసి వైఎస్ షర్మిలను కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్యామల గత కొంత కాలంగా హైదరాబాద్లోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. ఇంత వరకు జగన్ పార్టీలో కొనసాగిన శ్యామల ఇప్పుడు షర్మిల పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.











