శర్వానంద్ హీరోగా ‘మహాసముద్రం’ పేరుతో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కబోతోంది. దీనికి అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారు. అజయ్ భూపతి ఇంతకుముందు ఆర్.ఎక్స్. 100 సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ మహాసముద్రం సినిమాని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు తమిళంలోనూ ఏక కాలంలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు.
ఈ సినిమా విశేషాలను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. గమ్యం, ప్రస్థానం సినిమాల తర్వాత శర్వానంద్ కు ఇది క్రేజీ ప్రాజెక్టు అవుతుంది. ఇందులో ఓ విభిన్నమైన పాత్రను శర్వా పోషించనున్నట్లు అజయ్ భూపతి తెలిపారు. లవ్, యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుందని నిర్మాత సుంకర రామబ్రహ్మం తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ వారం వారం విడుదల చేస్తామని ఆయన తెలిపారు.