సోము వీర్రాజు ఈయన బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ కి పెద్ద లీడర్. ఇపుడు వైసీపీ కి అన్ ఆఫిసిఅల్ గా ఆ పార్టీ కార్యకలాపాలకు వత్తాసు పాడుతూ, టీడీపీని చంద్ర బాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు రాజకీయాల్లో ద్వంద్వ వైఖరి అవలంబిస్తారని ఆరోపించారు. అధికారంలో ఉన్నపుడు ఒకలా, లేకుంటే మరోలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం లేదన్నారని గుర్తు చేశారు.
ప్రతిపక్షంలోకి వచ్చాక ఇప్పుడు హోదా కావాలంటూ సభలు పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తే.. చంద్రబాబు బండారం బయట పెడతామని హెచ్చరించారు. బీజేపీ పెద్దలను పవన్, చంద్రబాబు కలుస్తున్నారని, అదే సమయంలో బహిరంగ వేదికలపై బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదనడం ఏమిటని ప్రశ్నించారు.
బీజేపీని విమర్శిస్తూ తిరిగి తామే కావాలని మా అధిష్టానాన్ని కలుస్తారని విమర్శించారు. జగన్పై కేంద్రం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అనడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు మాటల్లో నిలకడ లేదన్నారు. చంద్రబాబు మాట తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఇలా సోము వీర్రాజు టీడీపీ పై అక్కసు వెలగకుట్టున్నాడు.అదే సమయంలో వైసీపీ కి ఒత్తాసుగా మాట్లాడుతూ, వైసీపీ స్పొకె పర్సన్ గా మారిపోయాడని యిట్టె అర్థమైపోతుంది. ఒక వైపు చంద్ర బాబు నాయుడుగారు బీజేపీ తో పొత్తు అంటుంటే వీర్రాజు ఇటు బీజేపీకి గాని, టీడీపీకి గాని సపోర్ట్ గా మాట్లాడకుండా వైసీపీకి వత్తాసుగా మాట్లాడుతున్నాడు.. అసలు సోము వీర్రాజు బీజేపీపార్టీలో ఉంటూ వైసీపీ వెనకేసుకొచ్చేప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. సోము వీర్రాజులాంటి వ్యక్తులు ఉండబట్టే బీజేపీకి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ గతి పట్టింది అని తెలుస్తుంది.











