తన ఖాతాదారులకు తీపికబురు అందించింది స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా. పలు సేవలపై విధించే కోతలను తగ్గిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఖాతాల్లో కనీస నిల్వలు, పెద్దమొత్తంలో నగదు బదిలీలపై రుసుములను గణనీయంగా తగ్గించింది. ఈ నెల 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని తన ఖాతాదారులకు ట్వీట్ చేసింది.
కనీస నిల్వలను పట్టణాలు, నగరాలకు రూ.3000, గ్రామీణ ప్రాంతాలకు రూ.1000 ఖరారు చేసింది. ఈ మొత్తాలు కొనసాగించలేకపోతే శాతాన్ని బట్టి కోతలు విధించనుంది. కనీస మొత్తం 50 శాతం వరకు తగ్గితే రూ.10 తోపాటు జీఎస్టీ వసూలు చేస్తారు. అలాగే 50-70 శాతం మధ్య ఉంటే రూ. 12 తోపాటు జీఎస్టీ, 70 శాతం కన్నా మినిమమ్ బ్యాలెన్స్ తగ్గిపోతే రూ. 15 తోపాటు జీఎస్టీ పడుతుంది.
అలాగే పెద్దమొత్తంలో నగదు పంపించే వారికి వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంది. ఓ ఏడాది మొత్తంలో రూ. 7 లక్షల వరకు నగదు పంపించుకునే అవకాశం కల్పించింది.