సమ్మర్ స్టార్ట్ అయ్యింది. సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం కామన్. అయితే సమ్మర్ లో చాలామందిని వడదెబ్బ లేదా, డీహైడ్రేషన్ లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కచ్చితంగా కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకోసం ఏం చేయాలంటే…
నీళ్లు, కొబ్బరిబోండాలు..
మండే ఎండల నుంచి కాపాడుకోవడానికి వీలైనంతవరకు బయటకి వెళ్ళకపోవడం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం పది, సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రమే వెళ్లాలి. ఎండలోంచి వచ్చిన తర్వాత తల తిరుగుతున్నట్లు ఉన్నా, కళ్ళు మసకబారినా ఏమాత్రం అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నీటిని ఎక్కువ మోతాదులో తాగాలి. శరీరానికి కావల్సిన నీటిని తాగడం వలన శరీరానికి కావల్సిన హైడ్రేషన్ లభిస్తుంది. దీంతో తొందరగా అలిసిపోకుండా ఉంటారు. ఒక వేళ బయటకి వెళ్ళవలసి వస్తే గొడుగు తీసుకెళ్లాలి.
పిల్లల కోసం..
అసలే కరోనా, ఆపై ఎండలు ఇలాంటి సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉంటే బయటకి పంపకపోవడం మంచిది. అయితే చాలామంది పిల్లల చల్లదనం కోసం రెడీ మేడ్ ఫ్రూట్ జ్యూస్ లు, కోలాలు లాంటివి శరీరానికి హైడ్రేషన్ అందించకపోగా అవి మరింత హాని చేస్తాయి. వాటికి బదులుగా కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్ లాంటివి ఇవ్వడం మంచిది. దీనివల్ల పిల్లలకు తగు పోషకాలు అందుతాయి.
పెద్దలు ఏం చేయాలంటే…
అధిక ఉష్ణోగ్రతలు పెద్దవాళ్లను మరింత ఇబ్బందులకు గురి చేస్తాయి. అధిక మొత్తంలో మంచి నీరు, ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. ఎండ తగ్గాక సాయంత్రం పూట చేస్తే మంచిది. పోషకాలు పోకుండా కొబ్బరి నీరు, రాగి మాల్ట్ లాంటివి తీసుకోవాలి. గర్భిణులు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వన్యప్రాణుల రక్షణకు...
వేసవికాలంలో మనుషులే కాకుండా, వన్యప్రాణులు ఎండబారిన పడతాయి. వాటి కోసం టెర్రస్ పై నీళ్లు పెట్టడం మంచిది. సమ్మర్ కాబట్టి వేడి గాలులు తగకుండా చల్లదనం ఇచ్చే ప్రాంతాల్లో ఉంచాలి. ఆహారం కూడా డాక్టర్లను సంప్రదించి పెట్టడం మంచిది.











