వ్యాపారం బాగా జరిగి కోట్ల రూపాయాల లాబాలన అర్జించాలంటే తమ ప్రాడక్టును జనం దగ్గరికి తీసుకెళ్లాలి. ప్రాడక్టుని తీసుకు వెళ్లడమే కాదు.. వాటిని కస్టమర్లు కొనేలా వారిలో ఆసక్తిని కలిగించాలి. దానికోసం ప్రాడక్టుపై హైప్ క్రియేట్ చేయడం, తమ ప్రాడక్టే మంచిదనే నమ్మకాన్ని వారికి కలిగేలా చెయ్యాల్సి ఉంటుంది. దీనికోసం కంపెనీలు అనేక మార్గాలను, సాంకేతికతను తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రకటనలను గుప్పిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెటని, ఆన్లైన్ బిజినెస్ అని, ఆన్లైన్ షాపింగ్ అని, డోర్ డెలివరీ అని ఇలా రకరకాలుగా ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు, హోర్డింగ్ ప్రకటనలు, ఆన్లైన్ ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. మరికొంతమందేమో ఏకంగా సెలబ్రటీస్లను తీసుకొచ్చి వ్యాపార సంస్థలను ప్రారంభించి జనాల్లో హైప్ క్రియేట్ చేసి తమ వ్యాపారాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం తమ వ్యాపారాలను పెంచుకునేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లనే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. వివిధ రూపాల ద్వారా వ్యాపార ప్రకటనలిచ్చి ప్రాడక్టులను జనం కొనేలా చేస్తున్నాయి.
అయితే ఇప్పటి వ్యాపార ప్రకటనలు కస్టమర్లను ఆకర్షించేందుకు ఏవిధంగా ఉంటున్నాయో మనం చూస్తునే ఉన్నాం. కానీ వందేళ్ల క్రితం వ్యాపార ప్రకటనలు ఎలా ఉన్నాయో మీకు తెలుసా? అప్పటి తరం వారికి మాత్రమే వీటి గురించి తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి తరం వారికి అది తెలిసే ఛాన్సే లేదు. అయితే ఓ వ్యాపార సంస్థ తన సైకిల్కి సంబంధించిన పబ్లిసిటీ యాడ్ను వందేళ్ల క్రితం పేపర్ ప్రకటన ఇచ్చింది. అది 1915 ఏళ్లనాటి యాడ్ అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ సైకిల్ యాడ్ చాలా ఆసక్తిగా ఉందంటున్నారు.
‘బహు వేగముగాను, సులభముగాను పోవునటువంటి బలమైన సైకలు. 59 రూపాయల నుండి అమ్మబడును. క్యాటలాగు కావలసినవారికి పంపబడును’ అని 1915వ సంవత్సరం జనవరి 4వ తేదీ సోమవారం, మద్రాసు పేరుతో ఉన్నపేపర్ ప్రకటన వాట్సప్లో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రకటనను చూసిన వారు అబ్బా భలేగా ఉందే అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి అప్పటికి ప్రకటనల్లో ఎంత మార్పు వచ్చిందో కదా అని పలువురు ఈ యాడ్ గురించి చర్చించుకుంటున్నారు.











