డిజిటల్ మహానాడులో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు న్యూజిలాండ్ లో ఎన్ ఆర్ఐ, టీడీపీ అభిమానులతో ఆయన మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ అన్ని విధాల డెవలప్ మెంట్ అయ్యిందని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి.. ఇలా ఎన్నో రంగాలకు ఏపీని అనుకూలంగా మార్చామని, అందుకే విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వల్ల విదేశీ పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని, ఏపీ అంటేనే భయపడే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, టీడీపీ నాయకులను అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తలవంచేది లేదని, పోరాడి మళ్లీ అధికారంలో వస్తామని భరోసాను వ్యక్తం చేశారు. టీడీపీ బలోపేతానికి ఎన్ ఆర్ఐ కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు.
కడప సాక్షిగా ఒక్కటయిన ఎస్సీ వర్గాలు.. నామినేషన్ రోజే జగన్కి షాక్..!!
కడప జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డికి సహాయ...