ఉద్యోగులకు జీతాలు పెంపుతో పాటు, పదవీ విరమణ(రిటైర్మెంట్) వయస్సును పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పరిపాలనలో అనుభవం గడించిన ఉద్యోగుల సేవలను వినియోగించుకొనేందుకుగాను, పదవీ విరమణ వయస్సును 61కి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అసెంబ్లీ ఆమోదించింది. దీంతో సుమారు 36వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అయితే రిటైర్ మెంట్ వయస్సు పెంపు మంగళవారం నుంచి అమలు కానున్నట్లు ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- సీఎంకు సారాభిషేకం : రిటైర్మెంట్ వయస్సు పెంపుపై నిరుద్యోగుల భగ్గు











