సంక్రాంతి సినిమాల సందళ్ళు, వసూళ్లు, థియేటర్ల వివాదాలు చల్లారాక ముందే ఫిబ్రవరి -5 న మూడు సినిమాలు రిలీజ్ కి సై అంటున్నాయి. ప్రశాంత్ వర్మ కరోనా వైరస్.. బ్యాక్ డ్రాప్ లో తీసిన ” జాంబీ రెడ్డి” ఫిబ్రవరి -5 అని డేట్ ఇచ్చారు. నవీన్ పోలిశెట్టు హీరోగా వైజయంతి మూవీస్ నిర్మించిన ” జాతి రత్నాలు ” ట్రైలర్ ఇప్పటికే జనాన్ని ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి -5 న రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు మేకర్స్.
ఇక అదే రోజున ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ‘ఉప్పెన’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు . సాన బుచ్చి బాబు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఒక ప్రముఖ పంపిణీదారుడు మాత్రం ‘ఉప్పెన’ సినిమాని ఫిబ్రవరి -12 న రిలీజ్ చేయమని సూచించినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి -5 కి సంక్రాంతి సినిమాల హవా పూర్తి గా తగ్గిపోతుందని , ఈ చిన్న సినిమాలు రిలీజ్ కి ముందుకి వచ్చాయి. ఒకే రోజున మూడు సినిమాలు రిలీజ్ అయ్యే కన్నా, వారానికి ఒకటి చొప్పున విడుదల అయితే బాగుటుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఫిబ్రవరి మొదటి వారం దాటితే, సినిమాలకి సరైన సీజన్ కాదని ఆ సినిమాల మేకర్స్ భావిస్తున్నారు. మరి తెలుగు నిర్మాతల గిల్డ్ ఈ సమస్యని ఎలా సాల్వ్ చేస్తుందో చూడాలి.











