శర్వానంద్ హీరోగా , నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో -14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున ” శ్రీ కారం ” చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది . పండగ రోజుల్లో కూడా ఈ సినిమా షూటింగ్ జరుపుకుందని తెలుస్తోంది. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది .
ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. కొంతకాలంగా శర్వానంద్ కు సరైన హిట్ పడలేదు. ఈ సినిమా తో వరుస పరాజయాలకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నాడు శర్వానంద్.

మార్చి లో ” శ్రీ కారం ” చిత్రం విడుదల చేయాలనీ నిర్మాతలు గోపి ఆచంట , రామ్ ఆచంట ప్లాన్ చేశారు . గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయం ప్రధాన కధాంశంతో ఈ చిత్రం రూపొందింది .
సాయి మాధవ్ బుర్ర రచన చేసిన ఈ చిత్రానికి మీకీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.











