శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారం.. తెలియక జరిగిన పొరపాటు కాదు.. పక్కా ప్రణాళికతో.. పథకం ప్రకారం.. శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రపూరితంగా చేసిన నేరమని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో కొనుగోలు చేసి నెయ్యి అసలు నెయ్యే కాదని సీబీఐ సిట్ ఛార్జిషీట్లో తెలిపింది. అంతకు ముందు ఎన్డీడీబీ రిపోర్టులోనూ.. నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్తో పాటు బీఫ్ టాలో, లార్డ్ లాంటి యానిమల్ ఫ్యాట్స్ అవశేషాలు కనిపించాయని తేల్చింది.
తప్పు చేసిన వాళ్లు కనీసం క్షమాపణ చెప్పకుండా.. రివర్స్లో తప్పును బటయపెట్టిన కూటమి ప్రభుత్వంపైనే దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఏడుకొండల వాడిని రెండు కొండలకు పరిమితం చేయాలని చూసిన రోజు నుంచే తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు మొదలయ్యాయని ఆరోపించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన పాత్రధారులతో పాటు ఈ కుట్రకు తెరతీసిన అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టడానికి.. రిటైర్డ్ ఐఏఎస్ దినేశ్ కుమార్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా కల్తీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనున్నారు.
సా*క్షి పత్రికలో జీసస్ ఫోటోని సరైన ప్రమాణాలతో ప్రచురించలేదని.. ప్రభువు భక్తులకు క్షమాపణలు చెబుతూ పెద్ద లేఖ రాశారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. క్రైస్తువులు అడగకుండానే సారీ చెప్పిన జగన్రెడ్డి.. తిరుమల తిరుపతి దేవస్థానంలో.. శ్రీవెంకటేశ్వస్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన మహాపాపం తన హయాంలోనే జరిగినా.. శ్రీవారి భక్తులను క్షమించమని అడగటానికి ఆయనకు మనసు రాలేదు. పైగా ఆ తప్పుని బయటపెట్టిన కూటమి ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేయడం పట్ల.. భక్తులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసిన వారిని ఆ దేవుడు క్షమించినా.. భక్తులు మాత్రం వదిలే ప్రసక్తే లేదంటున్నారు. దేవ దేవుడి పట్ల జరిగిన మహాపచారాన్ని మెజారిటీ ప్రజలు రాజకీయ వివాదంలా కాకుండా.. హిందూ మతంపై జరిగిన దా*డిగా చూస్తున్నారు.











