వరద బాధిత జిల్లా వడివడిగా అడుగు!
రాయలసీమలోని వరద బాధిత జిల్లాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు గత రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. కడప అన్నమయ్య ప్రాజెక్ట్ వరద బాధితులకు భరోసా కల్పించి .. ఆధరించి నైతిక దైర్యం చెప్పిన చంద్రబాబు బుధవారం చిత్తూరు జిల్లా సుడిగాలి పర్యటనలతో చివరి వరద బాధితుడిని సైతం కలుస్తున్నారు. వారిలో దైర్యం నింపి .. అండగా నిలుస్తున్నారు. గత నాలుగురోజులు నుంచి ప్రమాద ఘంటికలు మోగిస్తున్న రాయల చెరువు 100కు పైగా గ్రామాలను, 10 వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. రాయలచెరువు ఈ స్థితికి రావడానికి బాధ్యులు ఎవరన్నది నేడు చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, రాయల చెరువు పరిశీలించేందుకు బయలు దేరారు. కానీ పోలీసులు అడుగడుగునా ఆంక్షాలు పెడుతూ అక్కడి వెళ్లొద్దని బాబులకు నోటీసులిచ్చారు. మొన్న మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ను అరెస్ట్ చేశారు. ఇలా రాష్ట్రంలో అధికారపార్టీ అగడాలను నిలదీస్తే నోటీసులిచ్చి వేదిస్తారు .. ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారని చంద్రబాబు వాపోయ్యారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ చంద్రగిరి నుంచి రాయల చెరువుకు చంద్రబాబు వెళ్లారు. చెరువు పూర్తిగా అక్రమణలకు గురవ్వడంతోనే వరదలు వచ్చినప్పుడల్లా రాయల చెరువు తరచూ ఉగ్రరూపం దాల్చడం సర్వసాధారణ విషయమే!
Must Read ;- వేడుకలు.. వినోదాలు తప్ప విషాదాలు పట్టవా!