మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని, ఆయన వెంటే నడుస్తామని కరీంనగర్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ అన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ చేరికపై ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ ఉన్నతికి పాటుపడుతున్నా..టీఆర్ఎస్ అధిష్టానం సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి మమ్మల్ని వేరే చేసే కుట్ర జరుగుతోందని, ఎమ్మెల్యే, మంత్రిగా అయ్యే అర్హతలు ఉన్నప్పటికీ, ఉద్యమ ద్రోహులకే మళ్లీ పదవులు కట్టాబెట్టాడతారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేనివాళ్లకు పదవులు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప సాక్షిగా ఒక్కటయిన ఎస్సీ వర్గాలు.. నామినేషన్ రోజే జగన్కి షాక్..!!
కడప జిల్లాలో ఎస్సీ సామాజికవర్గం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డికి సహాయ...