సంక్రాంతి సీజన్ ‘క్రాక్, మాస్టర్’ సినిమాలతో ప్రేక్షకుల్ని బాగానే ఎంగేజ్ చేసింది. ఈ రెండు మూవీస్ ఓ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టి దర్శక, నిర్మాతలకు భరోసానిచ్చాయి. కరోనా కారణంగా ఈ ఏడాది బాక్సాఫీస్ పోటీ పెద్ద లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఈ రెండు సినిమాలూ .. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడం నిజంగా గ్రేట్ . ఇక ఫిబ్రవరి కూడా టాలీవుడ్ కు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. ఈ నెల్లో రెండు సినిమాలు హిట్టయితే.. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
ఫిబ్రవరి 5న విడుదలైన ప్రశాంత్ వర్మ ‘జాంబీ రెడ్డి’ మంచి విజయం సాధించింది. బాలనటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న తేజ సజ్జా.. ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ అందుకున్నాడు. రాయలసీమ సీమ బ్యాక్ డ్రాప్ ను, జాంబీ జోనర్ ను మిక్స్ చేసి ఈ మూవీతో ప్రేక్షకుల్ని అలరించాడు దర్శకుడు ప్రశాంత్. కల్కి సినిమా రిజల్ట్ తో నిరాశ చెందిన ఇతగాడు.. జాంబీ రెడ్డి మూవీతో మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నాడు.
ఫిబ్రవరి 12న విడుదలైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ .. ఎంట్రీ మూవీ ‘ఉప్పెన’ సినిమా యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని .. అభిమానుల్ని ఖుషీ చేసింది. అలాగే.. కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు ఓ రేంజ్ లో లాభాల్ని తెచ్చిపెట్టింది. అలాగే.. ఇదే నెల్లో 19న అల్లరి నరేశ్ నాంది సినిమా .. మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ సినిమాతో అల్లరి నరేశ్ .. ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ సాలిడ్ హిట్ కొట్టి… నటన పరంగా.. శభాష్ అనిపించుకున్నాడు. మొత్తం మీద ఫిబ్రవరి నెలలో రెండు హిట్స్ .. ఒక బ్లాక్ బస్టర్ రావడం .. అసాధారణమైన విషయమే.