May 12, 2025 8:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఏఆర్‌ డెయిరీ కేసులో ఊహించని ట్విస్ట్‌.. అసలు దొంగ కొండ కిందే ఉన్నాడు..!!

October 3, 2024 at 8:00 PM
in Andhra Pradesh, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీ తిరుమల వెంకటేశ్వరునికి సమర్పించే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు చేరింది. అయితే ఈ వ్యవహారంలో దొంగే దొంగ .. దొంగ అన్నట్టుగా అప్పటి వైసీపీ నేతలు వ్యవహారిస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం ఉపయోగించే నెయ్యి కొనుగోలు వ్యవహారంలో అప్పటి టీటీడీ ఛైర్మన్‌ది ప్రధాన పాత్ర ఉంటుంది.

అయితే గతంలో టీటీడీ ఛైర్మన్లుగా పనిచేసిన వైసీపీ నేతలైన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి ఇద్దరు కూడా తేలుకుట్టిన దొంగల్లాగా వ్యవహారిస్తున్నారు. వారిలో భూమన కరుణాకర్‌ రెడ్డి అయితే ఒకడుగు ముందుకేసి.. తాము తప్పు చేసి ఉంటే.. తాను తన కుటుంబం సర్వనాశనమైపోవాలని శపధం చేశారు. వైవీ సుబ్బారెడ్డి అయితే ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు.

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవునెయ్యిని ఏఆర్‌ డెయిరీ సప్లయి చేస్తోంది. అయితే ఈ సప్లయ్‌ వ్యవహారంలోనూ మతలబు జరిగిందనేది ఇప్పుడు బయటికొస్తోంది. ఆ మతలబులో అప్పటి టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్‌రెడ్డే కీలక సూత్రధారిగా బయటికొస్తోంది. సిట్‌ విచారణలో ఇదే విషయం తేలినట్టు తెలుస్తోంది. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కల్తీ నెయ్యి సరఫరాపై తాను సేకరించిన వివరాలను కూడా బహిర్గతం చేశారు. ఐదు లక్షల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు 2023 అక్టోబరులో టీటీడీ టెండర్‌ పిలిస్తే.. చిత్తూరు జిల్లాలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ రివర్స్‌ టెండరింగ్‌లో కిలో రూ. 428.04కి కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచింది. అదే టెండర్‌లో ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ కిలోకు రూ. 432.96 కోట్‌ చేసి ఎల్‌3గా నిలిచింది.

నిబంధనల ప్రకారం ఎల్‌1గా ఉన్న.. వైష్ణవి డెయిరీ కోట్‌ చేసిన ధరకు నెయ్యి సరఫరా చేస్తే 35 శాతం ఆర్డర్‌ ఇస్తామని టీటీడీ ఏఆర్‌ డెయిరీ సంస్థకి చెప్పినప్పటికీ.. ఆ సంస్థ నెయ్యి సరఫరాకి ముందుకు రాలేదు. ఆ ధరకు తాము సరఫరా చేయలేమని 2023 నవంబరు 25న ఏఆర్‌ డెయిరీ సంస్థ స్పష్టం చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. అదే ఏఆర్‌ సంస్థ నాలుగు నెలలు తిరక్కుండానే 2024 మార్చిలో టీటీడీ పిలిచిన టెండర్లలో పాల్గొని.. నెయ్యి ధరను కిలో రూ. 320 చొప్పున కోట్‌ చేసి.. 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్‌ దక్కించుకుంది. నాలుగు నెలల ముందు కిలో రూ. 428కి కూడా ఇవ్వలేమన్న సంస్థ.. ఆ తరువాత నాలుగు నెలలకే రూ. 320కే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా సరఫరా చేయగలదనేది అందరిని తొలుస్తున్న సందేహం.

కల్తీనెయ్యి వ్యవహారంపై వివరాలను సేకరించిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో నెయ్యి కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగాయంటూ పలు ఆధారాల్ని ఆయన బయటపెట్టారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ‌ సాక్షాత్తు ఆ వేంకటేశ్వరస్వామికే అన్యాయం చేశారు. చేసిన తప్పునకు ఇప్పటికైనా క్షమాపణ కోరి, రాజకీయాల నుంచి వైదొలగాలని సూచించారు. కల్తీనెయ్యి వివరాలను వెల్లడిస్తూ.. 2023 ఫిబ్రవరిలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా ఉండగా.. అహ్మద్‌నగర్‌కు చెందిన మాల్గంగా మిల్క్‌ అండ్‌ ఆగ్రో ప్రొడక్ట్స్‌ సంస్థకు కిలోకి రూ. 496.90 చొప్పున పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు టీటీడీ ఆర్డర్‌ ఇచ్చిందని తెలిపారు.

ఆ తరువాత 2024 మార్చిలో భూమన కరుణాకరరెడ్డి హయాంలో ఏఆర్‌ డెయిరీకి కిలో రూ. 320 చొప్పున పది లక్షల కిలోల నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ఏడాది కాలంలో నెయ్యి ధర రూ. 496 నుంచి రూ. 320కి పడిపోతుందా? కిలో రూ. 496కి కాంట్రాక్ట్‌ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి తప్పు చేశారా? లేకపోతే రేటు తగ్గించి భూమన తప్పు చేశారా? ఇద్దరిలో దొంగ ఎవరు? అవన్నీ బయటకు రావాలనే సిట్‌ వేశామని ఆనం మాట్లాడారు. కిలో నెయ్యికి రూ. 411కి టెండర్‌ వేసిన ఏఆర్‌ డెయిరీ సంస్థ రివర్స్‌ టెండరింగ్‌లో రూ. 320కి ఎలా తగ్గిస్తుంది? పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌లో 0.1 శాతం మాత్రమే తగ్గుతుందని… అదే టీటీడీలో మాత్రం ఎంత కావాలంటే అంత రివర్స్‌ టెండరింగ్‌లో తగ్గించేస్తారని ప్రశ్నించారు.

2019 ఆగస్టు నుంచి 2024లో వైసీపీప్రభుత్వం గద్దె దిగేంత వరకు నెయ్యి కొనుగోళ్ల వివరాల్ని ఆనం వెంకటరమణారెడ్డి బయటపెట్టారు. టీటీడీకి 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఏఆర్‌ డెయిరీకి లేదన్నారు. వైష్టవి డెయిరీ నుంచి ఈ ఏడాది జులై 2న ‘ఏపీ 26 టీసీ 4779’ నంబరు గల ట్రక్కు 151889406707 వేబిల్లు నంబరుతో బయల్దేరిందని.. ఆ ట్రక్కులోనే తిరుమలకు చేర్చాల్సిన నెయ్యి ఉందన్నారు.

50 కి.మీ. దూరంలోని తిరుమలకు వెళ్లాల్సిన ఆ ట్రక్కు డ్రైవర్‌కు గూగుల్‌ మ్యాప్‌లో దారి తప్పుగా చూపించినట్టుందని చెబుతూ.. అదికాస్త కృష్ణగిరి, సేలం మీదుగా 508 కి.మీ. ప్రయాణించి దిండిగల్‌లోని ఏఆర్‌ ఫుడ్స్‌కు చేరింది. అదే ట్రక్కు కొత్త వేబిల్లు నంబరు 511673446306తో జులై 4న 3.27 గంటలకు ఏఆర్‌ ఫుడ్స్‌ నుంచి బయల్దేరి తిరుమలకు చేరుకుందన్నారు. దీని మర్మమేంటి? ఏఆర్‌ ఫుడ్స్‌ సంస్థ వైష్ణవి ఫుడ్స్‌ వంటి డెయిరీల నుంచి నెయ్యి కొని.. కొత్త వేబిల్లులతో టీటీడీకి పంపిస్తోందని కాదా అంటూ వైసీపీ నాయకులను ఆనం ప్రశ్నించారు.

నెయ్యి కల్తీ వ్యవహారం బయటపడిన తరవాత అప్పుడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి హడావుడి చేశారు. కొండపైకి వెళ్లిన కరుణాకర్‌ రెడ్డి .. తాము తప్పు చేసి ఉంటే… తాను తన కుటుంబం నాశనమైపోవాలని శపథం కూడా చేసి వచ్చారు. అయితే ఇప్పుడు బయటకొస్తున్న వివరాలతో.. అసలు నెయ్యి కల్తీ అంతా భూమన కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో జరిగినట్టుగా తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఉన్న నెయ్యి సప్లయర్ ను.. భూమన టీటీడీ చైర్మన్ అయ్యాక మార్చేసి.. టెండర్ రూల్స్ కూడా మార్చేశారు.

తద్వారా ఏఆర్ డెయిరీతో ఒప్పందం చేసుకునేలా చేశారు. భూమనతో కంపెనీలు చేసుకున్న ఒప్పందం మేరకు ఆ కంపెనీలు నెయ్యిని ఏఆర్ డెయిరీకి పంపిస్తే.. ఏఆర్‌ డెయిరీ తమ పేరుతో తిరుమలకు పంపుతున్నారు. ఇందు కోసం రివర్స్ టెండరింగ్ లో భారీగా తగ్గింపు కూడా ఇప్పించారు. వివిధ సంస్థలు నెయ్యిని సేకరించడంతో పెద్ద ఎత్తున కల్తీతో పాటు అవినీతి జరిగింది. సిట్ దర్యాప్తులో ఇటువంటి ఎన్నో విషయాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే తేలుకుట్టిన దొంగలాగా.. భూమున హడావుడి చేయడానికి కారణంగా తెలుస్తోంది

Tags: bhumana karunakar reddyCM Chandrababuleonewsleotoptirumalatirumala laddu newstirumala newsys jagan
Previous Post

అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రయ్‌.. రయ్‌… ఏపీకి మరో భారీ గుడ్‌ న్యూస్‌…!!

Next Post

ఏఆర్‌ డెయిరీ టాప్‌ సీక్రెట్‌ లీక్‌… ఇంత దారుణమా..??

Related Posts

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

by లియో డెస్క్
May 9, 2025 5:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన వేల కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ...

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

by లియో డెస్క్
May 9, 2025 3:12 pm

తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుపై దా*డి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు అప్పటి ప్రభుత్వ...

రాజధానిపై వైసీపీ భారీ స్కెచ్‌.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..!

by లియో డెస్క్
May 9, 2025 2:44 pm

సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘాటుగా బుద్ధి చెప్పినప్పటికీ వైసీపీ నేతల తీరు మారడం...

జగన్‌ పాదయాత్ర.. ప్రారంభించకముందే అట్టర్‌ ఫ్లాప్‌..!

by లియో డెస్క్
May 9, 2025 1:37 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.....

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

by లియో డెస్క్
May 9, 2025 1:14 pm

జగన్‌ హయాంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌లో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే...

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

by లియో డెస్క్
May 8, 2025 9:07 pm

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం...

జగన్‌ది కుటిల పన్నాగం.. ఆస్తి కోసం భారీ స్కెచ్‌.. తల్లి విజయమ్మ సంచలనం..!

by లియో డెస్క్
May 8, 2025 8:01 pm

సరస్వతి పవర్‌ అండ్ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో వాటాలను తల్లి విజయమ్మకు ఇచ్చాక...

అనైతిక సాక్షి అబద్దాలకు బ్రాoడ్ అంభాసిండర్..!

by లియో డెస్క్
May 8, 2025 10:30 am

అవినీతి,అబద్దాలతో పుట్టిన దొంగ సాక్షి అబద్దాలతోనే బతుకుతుంది. నిత్యం అబద్దాలు,కట్టుకథలు,కాకి లెక్కలతో  రాయడానికి...

అమరావతికి చంద్రబాబు వరల్డ్‌ క్లాస్‌ సిటీ టచ్‌.. భారీగా నిధులు..!

by లియో డెస్క్
May 7, 2025 12:58 pm

ప్రధాని మోదీ మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. దీంతో...

ఫైనల్ స్టేజ్‌కు లిక్కర్ స్కామ్‌.. బాస్‌ ఇద్దరు అసిస్టెంట్‌లకి లబ్‌ డబ్‌..!

by లియో డెస్క్
May 7, 2025 11:47 am

గడిచిన ఐదేళ్లూ ఏపీలో జగన్‌ హవా నడిచింది. ఎంతటివారినైనా సరే పాదాక్రాంతం చేసుకుని...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

Riya Sen Looks Sexy And Seductive In These Throwback Photos

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ఈ నెలలోనే రైతులకు చంద్రబాబు సర్కార్‌ సూపర్‌ గుడ్‌ న్యూస్..!

Actress Pragathi Latest Pics Going Viral

ఫైనల్ స్టేజ్‌కు లిక్కర్ స్కామ్‌.. బాస్‌ ఇద్దరు అసిస్టెంట్‌లకి లబ్‌ డబ్‌..!

‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

ముఖ్య కథనాలు

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

రాజధానిపై వైసీపీ భారీ స్కెచ్‌.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..!

జగన్‌ పాదయాత్ర.. ప్రారంభించకముందే అట్టర్‌ ఫ్లాప్‌..!

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

జగన్‌ది కుటిల పన్నాగం.. ఆస్తి కోసం భారీ స్కెచ్‌.. తల్లి విజయమ్మ సంచలనం..!

అనైతిక సాక్షి అబద్దాలకు బ్రాoడ్ అంభాసిండర్..!

అమరావతికి చంద్రబాబు వరల్డ్‌ క్లాస్‌ సిటీ టచ్‌.. భారీగా నిధులు..!

ఫైనల్ స్టేజ్‌కు లిక్కర్ స్కామ్‌.. బాస్‌ ఇద్దరు అసిస్టెంట్‌లకి లబ్‌ డబ్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

రాజధానిపై వైసీపీ భారీ స్కెచ్‌.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..!

జగన్‌ పాదయాత్ర.. ప్రారంభించకముందే అట్టర్‌ ఫ్లాప్‌..!

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

జగన్‌ది కుటిల పన్నాగం.. ఆస్తి కోసం భారీ స్కెచ్‌.. తల్లి విజయమ్మ సంచలనం..!

అనైతిక సాక్షి అబద్దాలకు బ్రాoడ్ అంభాసిండర్..!

అమరావతికి చంద్రబాబు వరల్డ్‌ క్లాస్‌ సిటీ టచ్‌.. భారీగా నిధులు..!

ఫైనల్ స్టేజ్‌కు లిక్కర్ స్కామ్‌.. బాస్‌ ఇద్దరు అసిస్టెంట్‌లకి లబ్‌ డబ్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

టార్గెట్ బిగ్‌బాస్‌.. లిక్కర్‌ స్కామ్‌లోకి ఈడీ ఎంట్రీ

CID ఆఫీసుకు సజ్జల,అవినాష్‌..టీడీపీ ఆఫీసుపై దా*డి కేసులో కీరోల్‌..!

రాజధానిపై వైసీపీ భారీ స్కెచ్‌.. సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌..!

జగన్‌ పాదయాత్ర.. ప్రారంభించకముందే అట్టర్‌ ఫ్లాప్‌..!

లిక్కర్ స్కామ్‌ బెంగళూరులో ల్యాండ్‌.. వేల ఎకరాల బంకర్‌..!

ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ కథ అడ్డం తిరిగింది.. దెబ్బకి సీన్‌ రివర్స్‌..!

జగన్‌ది కుటిల పన్నాగం.. ఆస్తి కోసం భారీ స్కెచ్‌.. తల్లి విజయమ్మ సంచలనం..!

అనైతిక సాక్షి అబద్దాలకు బ్రాoడ్ అంభాసిండర్..!

అమరావతికి చంద్రబాబు వరల్డ్‌ క్లాస్‌ సిటీ టచ్‌.. భారీగా నిధులు..!

ఫైనల్ స్టేజ్‌కు లిక్కర్ స్కామ్‌.. బాస్‌ ఇద్దరు అసిస్టెంట్‌లకి లబ్‌ డబ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist