మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘విజేత’ లో ఎంత ఎదిగిపోయావయ్యా.. ఎదను పెంచుకున్నావయ్యా.. అనే పాట ఉంటుంది. ఇప్పుడీ పాట చిరు మేనల్లుడు వైష్ణవ్ తేజ కు అన్వయించుకోవచ్చు ఆయన. చిరు నటించిన శంకర్ దాదా యం.బీ.బీయస్ లో జీవం లేని ఒక చిన్న కేరక్టర్ లో. అద్భుతంగా నటించి మెప్పించిన అతడు.. ఇప్పుడు ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా మారాడు. ఉప్పెనంత హిట్ అందుకున్నాడు. పెర్ఫార్మెన్స్ పరంగా బాగా ఆకట్టుకున్నాడని రిపోర్ట్స్ వస్తూండడంతో మెగా ఫ్యామిలీలో అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. చిరంజీవికైతే.. చాలా గర్వంగా ఉందట.
అందుకే మన ఆశి బాబు .. ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ సక్సెస్ తో తన పారితోషికాన్ని ఓ రేంజ్ లో పెంచేశాడట. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. వైష్ణవ్ .. ఉప్పెన చిత్రానికి కేవలం రూ. 50 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్ అందుకున్నాడు. అలాగే ఆ తర్వాత నటించిన క్రిష్ , రకుల్ ప్రీత్ మూవీ ‘కొండపొలం’ చిత్రానికి రూ. 75 లక్షలు అందుకున్నాడు. అయితే ఉప్పెన అనూహ్యమైన విజయం సాధించడమే కాకుండా.. నిర్మాతలకు కనకాభిషేకం చూస్తూండడంతో .. వైష్ణవ్ తన తదుపరి చిత్రానికి రూ. 2.5 కోట్లు వరకూ డిమాండ్ చేస్తున్నాడట. నిర్మాత బీ.వీ. యస్. యన్ ప్రసాద్ వైష్ణవ్ తేజ తో ఒక సినిమా నిర్మిస్తున్నారు. దానికోసమే వైష్ణవ్ అంత పారితోషికం అందుకుంటున్నాడట. ఈ లెక్కన చూస్తే .. వైష్ణవ్ స్టార్ హీరో అయిపోయినట్టే కదూ.