‘బాహుబలి’ సంచలన విజయం తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ జాతకమే మారిపోయింది. అతడి క్రేజ్ అంతకు ముందున్న దాని కన్నా ఎన్నో రెట్లు పెరిగింది. మార్కెట్ కూడా దానికి తగ్గట్టుగానే బాగా విస్తరించింది. ఇప్పుడు అతడితో ఎవరైనా సినిమా తీయాలంటే.. మినిమమ్ రూ. 300 కోట్లు బడ్జెట్ పెట్టాల్సిందే. దాని రిటర్న్స్ రాబట్టేందుకు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాల్సిందే. ప్రస్తుతం అతడు నటిస్తోన్న రాధేశ్యామ్, చేయబోతున్న సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు అన్నీ పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్నాయి. అందుకేనేమో డార్లింగ్ తన పారితోషికాన్ని రికార్డు స్థాయిలో పెంచేశాడట.
తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఒకో సినిమాకి రూ. 100 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకొనే మొట్టమొదటి భారతీయ నటుడు, తెలుగు నటుడూ ప్రభాస్ కావడం విశేషం. ముంబైలోని బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అన్నీ ప్రభాస్ కు వందకోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేయడానికి ముందుకొచ్చాయట. ఈ లెక్కన ప్రభాస్ దరిదాపుల్లో ఆ రేంజ్ లో పారితోషికం అందుకొనే హీరోనే ఇండియాలో లేడని చెప్పుక తప్పదు. అంతేకాదండోయ్.. బాలీవుడ్ కు తోపుల్లాంటి హీరోలైన ఖాన్ త్రయం కూడా ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోకపోవడం విశేషమనే చెప్పుకోవాలి.
Must Read ;- ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ అప్డేట్ అప్పటి నుంచే!