చాలాకాలం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్ ’ తో తెరమీదికొచ్చాడు. శుక్రవారం పవన్ సినిమా విడుదల కానుండటంతో, వారం రోజులకు ముందుగానే భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి. అభిమాన నాయకుడి సినిమా రీలిజ్ కానుండటంతో అభిమానులు కూడా థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయ్యారు. అభిమానుల ఆశలపై, వకీల్ సాబ్ షోస్ పై ఏపీ సర్కార్ అడ్డంకులను విధిస్తూ షాక్ ఇచ్చింది. కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు వారం రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంది. ప్రముఖ హీరోల చిత్రాలకు ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించే అవకాశమూ ఉంది.
అభిమానుల ఆందోళన
అన్ని చిత్రాల మాదిరిగానే దీనికీ ప్రీమియర్ షో, ధరల పెంపునకు అనుమతి ఉంటుందని ఎగ్జిబిటర్లు, బయ్యర్లు భావించారు. అయితే ‘వకీల్సాబ్ చిత్రానికి ప్రీమియర్ షోలకు అనుమతి లేదని, టికెట్ల ధరల పెంపునూ అనుమతించేది లేదు’ అని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత చెప్పడంతో అభిమానులు ఆందోళన చెందారు. ముందుగానే ప్రీమియర్ షోలు చూద్దామనుకున్న అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. కొంతమంది థియేటర్లపై దాడులు కూడా చేశారు. కొన్ని చోట్ల తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేయడంతో కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు, ఏపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదంటూ అభిమానులు ప్రశ్నించారు. అభిమానుల ఆందోళనతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
Must Read ;- పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ కు డివైడ్ టాక్











