మనిషి ఒకచోట.. మనసు ఒకచోట.. ఈ మాట విజయసాయిరెడ్డి గారికి బాగా వర్తిస్తుంది. ఆయన శారీరికంగా బయట ఉన్నారే గానీ.. మనసంతా కారాగారం చుట్లూ తిరుగుతున్నట్లుంది. అందుకే పాపం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్పై కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్తే జైలు పాలవ్వాల్సి వస్తుందని మనసంతా భయపడుతూనే.. కార్మికులు నిరసనలో పాల్గొన్నట్లున్నారు. కానీ, మనసులో భయాన్ని ఎంతని దాచగలరూ.. ఎంతసేపని బయటపెట్టకుండా అణుచుకోగలరు.. మొత్తానికి మనసులో మాట కాస్త బయటపడింది. ‘2002 నుంచి రుణ రహిత కారాగారంగా’ అంటున్న వీడియో నెట్టింట కాస్త వైరల్ అవుతుంది. ఆ తర్వాత కర్మాగారాన్ని.. కారాగారమన్నానని విజయసాయి గారు సర్దుకున్నారు గానీ.. అది మీ మనసులోని మాటేలే అంటూ జనాలు అభిప్రాయపడుతున్నారు.
ఇదంతా మన ఖర్మ..
ఈ కార్మాగార.. కారాగార.. వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో అయ్యన్నపాత్రుడు పోస్ట్ చేసి.. ఇదంతా మన ఖర్మ అంటున్నారు. ‘కర్మాగారం ఎదో,కారాగారం ఏంటో తెలియని వాడు రాజ్యసభ సభ్యుడు అవ్వడం మన ఖర్మ.గనులన్నీ గాలి బ్రదర్స్ తో కలిసి కొట్టేసిన మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చెయ్యడం విచిత్రంగా ఉంది.’
కర్మాగారం కోసం పోరాడితే జగన్ రెడ్డి కారాగారానికి పోతాడు అందుకే సైలెంట్ గా ఉన్నాడని సాయిరెడ్డి మనస్సులో మాట బయటపెట్టినట్టు ఉన్నాడు.జగన్ రెడ్డి చేతుల్లో ఉన్న ఘనులు కేటాయిస్తే చాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆరు నెలల్లో లాభల్లోకి వస్తుంది.(2/2)@VSReddy_MP @ysjagan
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) February 10, 2021
‘కర్మాగారం కోసం పోరాడితే జగన్ రెడ్డి కారాగారానికి పోతాడు అందుకే సైలెంట్ గా ఉన్నాడని సాయిరెడ్డి మనస్సులో మాట బయటపెట్టినట్టు ఉన్నాడు.జగన్ రెడ్డి చేతుల్లో ఉన్న ఘనులు కేటాయిస్తే చాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆరు నెలల్లో లాభల్లోకి వస్తుంది.’
మనసులో మంత్రమిదేనా..
కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమాత్రం గట్టిగా గళమెత్తినా.. విజయసాయితో పాటు, సీఎం జగన్ గారికి కూడా కారాగారవాసం తప్పదనే విశ్లేషకులు అంటున్నారు. అందుకే నిరసనకు మద్దతుగా కనీసం సీఎం గారు ప్రకటన కూడా చేయలేదంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారే గానీ.. దీనిపై ఇప్పటి వరకు సీఎం గట్టిగా నోరువిప్పిన దాఖలాలు లేవు. కేవలం కేంద్రంకి ఒక లేఖ రాయడంతో సరిపెట్టారు. మరి వ్యతిరేకంగా వెళ్లే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదనేనా ఈ మౌనం.











